మధుమేహులకు ఉసిరి ఎంతో మేలు చేస్తుంది. ఉసిరి మధుమేహాన్ని నియంత్రించడానికి సమర్థవంతంగా పని చేస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రించేందుకు రోజూ ఉసిరి రసాన్ని చక్కెరలో కలిపి తాగాలి. ఇలా ఉదయం, సాయంత్రం తాగడం వల్ల మీబ్లడ్లోని షుగర్ లెవల్స్ను అదుపులో ఉంచుతుంది.
గ్రీన్ యాపిల్, దోసకాయ, నిమ్మకాయ, కాలే, గ్రీన్ క్యాబేజీ, సెలెరీ, బచ్చలికూర, బీట్రూట్, వెల్లుల్లి, టమోటా, అల్లం తీసుకోవాలి. ఇవన్నీ పదార్ధాలను కలిపి జార్ లో వేసుకుని కొన్ని నీళ్లు పోసి మొత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంతో అద్భుతమైన గ్రీన్ జ్యూస్ తయారై పోతుంది. ఈ గ్రీన్ జ్యూస్ ను ఉదయం సమయంలో తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మీ బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
టమోటా, కీరదోస, కారకకాయ కాంబినేషన్ జ్యూస్ కూడా మధుమేహులు మంచి చేస్తుంది. ముఖ్యంగా వేసవిలో ఎండవల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. శరీరంలో పేరుకు పోయిన కొవ్వంతా కరిగిపోయి వెయిట్ లాస్ అవుతారు.గుండె ఆరోగ్య వంతంగా మారుతుంది. కంటి చూపు మెరుగు పడుతుంది.మరియు వేసవి వేడిని తట్టుకునే శక్తి సైతం లభిస్తుంది. కాబట్టి, మధుమేహం వ్యాధి ఉన్న వారే కాదు. ఎవ్వరైనా ఈ జ్యూస్ను తయారు చేసుకుని తీసుకోవచ్చు.
షుగర్ బాధితులకు బొప్పాయి కూడా మేలు చేస్తుంది. బొప్పాయిలో కొవ్వులు, కార్బోహైడ్రేట్లు మరియు కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బొప్పాయి రసం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తక్కువగా ఉంచడానికి చాలా మంచిది.
షుగర్ బాధితులకు ఆకు కూరలు కూడా మేలు చేస్తాయి. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు బచ్చలికూర రసాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బచ్చలికూరలో విటమిన్ ఎ, విటమిన్ బి, సి, ఇ పుష్కలంగా లభిస్తాయి. దీని వినియోగం వల్ల శరీరంలో షుగర్ అదుపులో ఉంటుంది.(ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)