IND vs WI: వెస్టిండీస్తో శనివారం జరిగిన 4వ మ్యాచ్లో యశస్వీ జైస్వాల్ ఆరంగేట్ర హాఫ్ సెంచరీతో రాణించాడు. తద్వారా భారత్ తరఫున అంతర్జాతీయ టీ20 క్రికెట్లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన నాల్గో పిన్న వయస్కుడిగా రికార్డుల్లో నిలిచాడు.
ఇదే సిరీస్తో వెస్టిండీస్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో తిలక్ వర్మ కూడా ఆరంగేట్ర హాఫ్ సెంచరీ నమోదు చేసి.. భారత్ తరఫున అంతర్జాతీయ టీ20 హాఫ్ సెంచరీ చేసిన రెండో పిన్న వయస్కుడిగా నిలిచాడు.
మొత్తానికి భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో హాఫ్ సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. 20 ఏళ్ల 143 రోజుల వయసులో రోహిత్ శర్మ 2007 టీ20 వరల్డ్కప్ టోర్నీలో తన తొలి హాఫ్ సెంచరీ సాధించాడు.
అలాగే తిలక్ వర్మ 20 ఏళ్ల 271 రోజుల వయసులో.. వెస్టిండీస్తో జరిగిన 2వ టీ20 మ్యాచ్లో తన టీ20 హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
ఇంకా 21 ఏళ్ల 38 రోజుల వయసులో తొలి టీ20 నమోదు చేసిన రిషభ్ పంత్.. ఈ లిస్టులో మూడో స్థానంలో ఉన్నాడు.
తాజాగా శనివారం జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా 21 ఏళ్ల 227 రోజుల వయసులో యశస్వీ.. తన తొలి హాఫ్ సెంచరీ చేశాడు. ఇలా నాల్గో స్థానంలో నిలిచాడు. .