టీ 20 ఫార్మాట్లో నాయకత్వ మార్పు కోసం భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తలుపులు తెరిచారు. 16 సెప్టెంబర్, గురువారం కోహ్లీ ఈ ఫార్మాట్లో జట్టు కెప్టెన్సీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడు. టీ 20 ప్రపంచకప్ తర్వాత తాను ఇకపై జట్టుకు కెప్టెన్గా ఉండనని కోహ్లీ చెప్పాడు. కోహ్లీ నాయకత్వంలో ఈ ఫార్మాట్లో భారత ప్రదర్శన అద్భుతంగా ఉంది. జట్టు 45 టీ 20ల్లో 29 మ్యాచ్లు గెలిచింది. కోహ్లీ కెప్టెన్సీలో టీమ్ అన్ని పెద్ద దేశాలకు వెళ్లి టీ 20 సిరీస్లు గెలిచింది.
కోహ్లీ 2017 లో మహేంద్ర సింగ్ ధోని నుండి వన్డేలు, టీ 20 ల్లో బాధ్యతలు స్వీకరించాడు. అదే సంవత్సరం శ్రీలంకలో తన మొదటి ద్వైపాక్షిక టీ 20 సిరీస్ ఆడాడు. ఈ సిరీస్లో భారత్ సులభంగా గెలిచింది.
దీని తర్వాత, కోహ్లీ దక్షిణాఫ్రికాలో జరిగిన టీ 20 సిరీస్లో కూడా భారత్ని గెలిపించాడు. సేనా దేశాలలో (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా), 2018 లో మొదటి టీ 20 సిరీస్ను భారత్ గెలుచుకుంది. టీమిండియా ఈ సిరీస్ను 2-1తో గెలుచుకుంది.
ఈ విజయ పరంపరను కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఇంగ్లండ్లోనూ కొనసాగించింది. 2018 లోనే జరిగిన ఈ సిరీస్లో, భారతదేశం 2-1తో గెలిచింది. ఇంగ్లండ్ కేవలం రెండు సంవత్సరాల క్రితం టీ20 ప్రపంచ కప్లో ఫైనల్ ఆడింది. ఒక సంవత్సరం తరువాత వన్డే ప్రపంచ కప్ గెలిచింది.
కోహ్లీ సారథ్యంలో వెస్టిండీస్ని టార్గెట్ చేసింది భారత జట్టు. 2019 ప్రపంచ కప్ నిరాశ తరువాత, భారత జట్టు విండీస్ పర్యటనకు వెళ్లింది. అక్కడ 3 మ్యాచ్ల సిరీస్లో భారత జట్టు క్లీన్ స్వీప్ చేసింది.
స్వదేశంలో జరిగిన ఐదు మ్యాచ్ల టీ 20 సిరీస్లో కోహ్లీ జట్టు 5-0తో న్యూజిలాండ్ను ఓడించినప్పుడు, 2020 లో భారతదేశంలో అతిపెద్ద టీ 20 సిరీస్ విజయం సాధించింది. కోహ్లీ మొదటి 4 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించగా, రోహిత్ శర్మ చివరి మ్యాచ్లో బాధ్యతలు స్వీకరించాడు.
2020-21 ఆస్ట్రేలియా పర్యటన భారతదేశానికి ఎంతో కీలకమైంది. అయితే, మొదటి వన్డే సిరీస్లో టీమిండియా 2-1 ఓటమిని చవిచూసింది. కానీ, ఆ తర్వాత టీ 20 సిరీస్లో టీమిండియా తిరిగి పుంజుకుని 2-1తో ఆతిథ్య జట్టును ఓడించింది.
భారత గడ్డపై, టీమిండియా అనేక మ్యాచ్లు, సిరీస్లను గెలుచుకుంది. కానీ, ఈ సంవత్సరం మార్చిలో ఇంగ్లండ్తో ఉత్కంఠభరితమైన సిరీస్లో జట్టు 3-2తో గెలిచింది. కోహ్లీ ఆ సిరీస్లో అత్యధిక పరుగులు సాధించాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికయ్యాడు.