- Telugu News Photo Gallery Cricket photos Team india star player virat kohli international debut on this day august 18th 2008 vs sri lanka odi series 14 years kohli records here
Virat Kohli: విరాట్ కోహ్లీ @ 14 ఏళ్లు.. ఆ మూడు రికార్డుల్లో తగ్గేదేలే అంటోన్న రన్మెషీన్.. పూర్తి జాబితా ఇదే..
Virat Kohli Debut: విరాట్ కోహ్లీ 18 ఆగస్టు 2008న తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అరంగేట్రం మ్యాచ్లో కేవలం 12 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు.
Updated on: Aug 18, 2022 | 12:04 PM

Virat Kohli Debut: విరాట్ కోహ్లీ అంతర్జాతీయ అరంగేట్రం చేసి నేటితో 14 సంవత్సరాలు పూర్తయింది. అతను 18 ఆగస్టు 2008న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి 14 సంవత్సరాలలో అత్యధిక అంతర్జాతీయ పరుగులు, సెంచరీలు చేసిన పరంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

2008లో అండర్-19 ప్రపంచకప్లో భారత జట్టును గెలుచుకున్న తర్వాత, విరాట్ కోహ్లీకి ఐపీఎల్లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఇక్కడ అతను RCB తరపున ఆకట్టుకున్నాడు. ఆ తరువాత అతను ఆగస్టు 2008లో శ్రీలంక పర్యటన కోసం జట్టులో ఎంపికయ్యాడు.

5 మ్యాచ్ల ODI సిరీస్లో మొదటి మ్యాచ్ 18 ఆగస్టు 2008న దంబుల్లాలో జరిగింది. ఇందులో విరాట్ కోహ్లీ ప్లేయింగ్ ఎలెవన్లోకి వచ్చాడు. అరంగేట్రం మ్యాచ్లో 22 బంతుల్లో 12 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోయింది.

కోహ్లికి ఈ సిరీస్లోని అన్ని మ్యాచ్ల్లో ఆడే అవకాశం లభించింది. అతను 5 మ్యాచ్ల్లో 31.80 సగటుతో 159 పరుగులు చేశాడు. ఈ సమయంలో ఓ హాఫ్ సెంచరీ కూడా చేశాడు. అప్పటి నుంచి కోహ్లీ వన్డే జట్టులో రెగ్యులర్గా ఆడుతున్నాడు. ODI అరంగేట్రం చేసిన రెండేళ్ల తర్వాత T20 ఇంటర్నేషనల్లో అరంగేట్రం చేసే అవకాశాన్ని పొందాడు. ఒక సంవత్సరం తర్వాత టెస్ట్ క్యాప్ను కూడా అందుకున్నాడు. విరాట్ తన T20 అంతర్జాతీయ అరంగేట్రం 12 జూన్ 2020న జింబాబ్వేపై ఆడగా, 20 జూన్ 2011న టెస్ట్ అరంగేట్రం చేశాడు.

విరాట్ కోహ్లీ ఈ 14 ఏళ్లలో మూడు ఫార్మాట్లలో కలిపి 23,726 అంతర్జాతీయ పరుగులు చేశాడు. ఈ కాలంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ 14 ఏళ్లలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా జో రూట్ (17,566 పరుగులు) నిలిచాడు.

విరాట్ ఇప్పటివరకు 70 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. గత 14 ఏళ్లలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్గా కూడా నిలిచాడు. కోహ్లీ తర్వాత హమీష్ ఆమ్లా రెండో స్థానం(50)లో ఉన్నాడు.

విరాట్ తన అంతర్జాతీయ కెరీర్లో 57 సార్లు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు. ఈ 14 ఏళ్లలో అత్యధిక 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచిన ఆటగాడు కూడా కోహ్లీదే అగ్రస్థానం. ఆ తర్వాత రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ 35 సార్లు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు.




