
Ravichandran Ashwin Key Comments on Rohit Sharma: ఐపీఎల్ 2025 కోసం మెగా వేలానికి సంబంధించి బీసీసీఐ నిబంధనలను ప్రకటించింది. వేలానికి ముందు ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేయాలనే ఆలోచనలో ఫ్రాంచైజీలన్నీ బిజీగా ఉన్నాయి. కొన్ని ఫ్రాంచైజీలు తమ కీలక ఆటగాళ్లను కూడా విడుదల చేయవలసి వస్తుంది.

వెటరన్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ కూడా వేలానికి ముందు తన పాత ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ను విడిచిపెడతాడని వార్తలు వినిపిస్తున్నాయి. వేలంలో రోహిత్ వస్తాడని చాలా ఫ్రాంచైజీలు ఎదురుచూస్తున్నాయి. వీటిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరు కూడా ఉంది.

ఇదిలా ఉంటే, మెగా వేలంలో రోహిత్ శర్మను కొనుగోలు చేయడానికి RCB ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుందని రవిచంద్రన్ అశ్విన్ కీలక అంచనా వేశాడు. వాస్తవానికి, RCB రాబోయే సీజన్ కోసం కొత్త కెప్టెన్ కోసం వెతుకుతోంది. రోహిత్ కంటే మెరుగైన ఎంపిక మరొకటి ఉండదు. అదే సమయంలో, అభిమానులు కూడా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ RCB కోసం కలిసి ఆడాలని కోరుకుంటున్నారు.

అశ్విన్ తరచుగా యూట్యూబ్ ద్వారా తన అభిమానులతో ఇంటరాక్ట్ అవుతుంటాడు. ఈ సమయంలో, ఒక అభిమాని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఐపిఎల్లో ఒకే జట్టుకు ఆడటం గురించి అడిగాడు. దీనిపై అశ్విన్ స్పందిస్తూ.. రోహిత్ శర్మను ఆర్సీబీ జట్టులోకి తీసుకోవాలంటే రూ.20 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని చెప్పాడు. రోహిత్ శర్మ కోసం వేలం వేయాలనుకుంటే 20 కోట్ల రూపాయలు ఉంచుకోవాల్సిందే అంటూ చెప్పుకొచ్చాడు.

కుడిచేతి వాటం బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ ఐపీఎల్లోని అత్యంత ప్రముఖ ఆటగాళ్లలో ఒకడు కావడం గమనార్హం. దీనితో పాటు, అతను ఈ మెగా లీగ్లో సంయుక్తంగా అత్యంత విజయవంతమైన కెప్టెన్ కూడా. అతని కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ట్రోఫీని గెలుచుకుంది. అదే సమయంలో, RCB ఇప్పటికీ ట్రోఫీని గెలుచుకోలేకపోయింది. రోహిత్ ఈ ఫ్రాంచైజీకి కెప్టెన్గా మారితే, ఆర్సీబీ ట్రోఫీ కరువును ముగించగలడు. ఈ విషయం RCB అభిమానులకు కూడా బాగా తెలుసు.