
IND vs AUS 2nd ODI: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో అశ్విన్ 3 వికెట్లు తీశాడు. తద్వారా అశ్విన్ ఆస్ట్రేలియాపై అన్ని ఫార్మాట్లలోనూ 144 వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఇలా ఒకే జట్టుపై అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు.

నిజానికి ఈ మ్యాచ్కి ముందు ఈ రికార్డ్ అనిల్ కుంబ్లే పేరటి ఉండేది. టీమిండియా మాజీ కెప్టెన్ కుంబ్లే ఆస్ట్రేలియాపైనే 142 వికెట్లు పడగొట్టాడు. అయితే తాజాగా 3 వికెట్లు పడగొట్టిన అశ్విన్ ఆ రికార్డ్ను తన సొంతం చేసుకోవడంతో.. భారత్ తరఫున ఒకే జట్టుపై అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో ఆటగాడిగా కుంబ్లే మారాడు.

ఇక కుంబ్లే తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఉన్నాడు. కపిల్ పాకిస్తాన్పై 141 వికెట్లు పడగొట్టి ఈ లిస్టులో స్థానం పొందాడు.

అలాగే కుంబ్లే పాకిస్తాన్పై కూడా 135 వికెట్లు.. కపిల్ వెస్టిండీస్పై 132 వికెట్లు తీసుకుని ఇదే లిస్టులో 4, 5 స్థానాల్లో కూడా ఉన్నారు. అంటే భారత్ తరఫున ఒకే జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల లిస్టులో అశ్విన్ అగ్రస్థానంలో ఉండగా.. 2, 4 స్థానాల్లో అనిల్ కుంబ్లే.. 3, 5 స్థానాల్లో కపిల్ దేవ్ ఉన్నారు.

కాగా, నిన్నటి మ్యాచ్లో శ్రేయాస్ అయ్యర్(105), శుభమాన్ గిల్(104) సెంచరీలతో.. కేఎల్ రాహుల్(52), సూర్యకుమార్ యాదవ్(72, నాటౌట్) అర్థ సెంచరీలతో మెరిశారు. బౌలింగ్లో అశ్విన్, జడేజా చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. దీంతో 3 వన్డేల సిరీస్ని భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.