
42వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఎంఎస్ ధోని 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత కెరీర్లో అప్పటి వరకూ ఉన్న గుర్తింపు మరింత అధికం అయింది. ఏప్రిల్ 2010లో IPL ఛాంపియన్ షిప్ ను అందుకున్నాడు. అయితే సాక్షి.. ధోని జీవితంలోకి ప్రవేశించిన అనంతరం కెరీర్ లో సక్సెస్ రేటు మరింత అధికం అయింది.

ధోనీ తన చిన్నతనంలోనే సాక్షితో పరిచయం ఉంది. ఇద్దరూ రాంచీలోని ఒకే పాఠశాలలో చదువుకునేవారు. అయితే సాక్షి కుటుంబం డెహ్రాడూన్కు షిప్ట్ అవడంతో ధోని సాక్షిల పరిచయానికి ఫుల్ స్టాప్ పడింది. తిరిగి వీరిద్దరిని కలపడానికి కాలం 10 సంవత్సరాలు తీసుకుంది.

ధోనీ 10 ఏళ్ల తర్వాత క్రికెటర్గా టీం ఇండియాలో అడుగు పెట్టాడు. సాక్షి కోల్కతాలోని హోటల్ తాజ్లో ఇంటర్న్షిప్ చేస్తున్న సమయంలో.. టీమిండియా ఒక మ్యాచ్ ఆడడం కోసం కోల్ కతాలోని హోటల్ తాజ్ లో బసలో చేసింది. ఆ టీమ్ లో ధోని కూడా ఉన్నాడు. అప్పుడు మళ్లీ ధోనీ, సాక్షి కలిశారు. 10 ఏళ్ల తర్వాత కలుసుకున్న ధోని, సాక్షిల చూపులు కలిశాయి. బాలుడుగా విడిపోయిన ధోనీని యువకుడిగా సాక్షి కలిసిన ఆ హోటల్లో ఇంటర్న్షిప్కి చివరి రోజు కావడం విశేషం.

సాక్షిని తొలిచూపులోనే ధోనీ ఇష్టపడ్డాడు. సాక్షిని కలవాలని మాట్లాడాలని తహతహలాడాడు. అయితే సాక్షి ఫోన్ నెంబర్ తెలియదు.. ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు.. అప్పుడు వీరిద్దరి మధ్య వారధిలా ధోని మేనేజర్ పనిచేశాడు.

ధోనీ మేనేజర్, స్నేహితుడు యుధ్జిత్ దత్తా .. సాక్షికి కూడా మంచి స్నేహితుడు. దీంతో సాక్షి ఫోన్ నెంబర్ ధోనికి ఇచ్చాడు. అప్పుడు ధోని మెసేజ్ చేయడం ప్రారంభించాడు. ఇద్దరి మధ్య మెసేజ్ ల పర్వం కొనసాగింది. అయితే ధోని ప్రేమని సాక్షి మొదట్లో జోక్ గా తీసుకుంది. అయితే ధోని ప్రేమ నిజమని రుజువు అయ్యాక సాక్షి కూడా రిలేషన్ షిప్ ను సీరియస్ గా తీసుకుంది.

మార్చి 2008 నుండి ధోనీ , సాక్షి లు డేటింగ్ ప్రారంభించారు. అయితే ఇద్దరూ తమ ప్రేమను పెళ్లి రోజు వరకు ప్రపంచానికి కూడా తెలియకుండా గోప్యంగా ఉంచారు. 2 సంవత్సరాల పాటు డేటింగ్ తర్వాత వారిద్దరూ 4 జూలై 2010న వివాహం చేసుకున్నారు.

సాక్షి జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత ధోనీ సక్సెస్లో మలుపు తిరిగింది. మరుసటి సంవత్సరంలోనే అంటే 2011లో ధోనీ కెప్టెన్సీలో భారత్ను రెండోసారి వన్డే ప్రపంచ ఛాంపియన్గా నిలిపాడు. అదే సంవత్సరంలో ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్కు వరుసగా రెండవ IPL టైటిల్ను అందించాడు.

సాక్షితో పెళ్లి తర్వాత ధోనీ కెరీర్ ఏడాది ఏడాదికి పీక్ స్టేజ్ కు చేరుకుంది. ధోని విజయాల పర్వం పరిగెడుతూ సాగింది. 2013లో తన కెప్టెన్సీలో ఇంగ్లండ్ గడ్డపై భారత్ను ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిపాడు. దీనితో ధోనీ మూడు ప్రధాన ICC టైటిళ్లను అందుకున్న ఏకైక కెప్టెన్ గా రికార్డ్ సృష్టించాడు.

ఎంఎస్ ధోని ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పేశాడు. అయితే ఇప్పటికీ ఐపీఎల్ లో కెప్టెన్ గా విజయాల పర్వం కొనసాగిస్తూనే ఉన్నాడు. ధోనీ, సాక్షి ఎక్కడ ఉంటారో.. వారి చుట్టూ విజయం తిరుగుతుంది అని ఫ్యాన్స్ సరదాగా కామెంట్ చేస్తూ ఉంటారు.