
ఐపీఎల్ 2026 (IPL)లో 23వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్జెయింట్స్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్లో అందరి దృష్టి విరాట్ కోహ్లీపైనే ఉంది. ఈ మ్యాచ్లో ఓ భారీ రికార్డు సృష్టించే అవకాశం అతనికి ఉంది. ఇప్పటివరకు క్రిస్ గేల్, రోహిత్ శర్మ మాత్రమే ఈ రికార్డును సాధించారు.

లక్నోతో జరిగే మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఐపీఎల్లో ట్రిపుల్ సెంచరీ సిక్సర్లు కొట్టే మైలురాయిని చేరుకునేందుకు చేరువయ్యాడు. ఇంతకుముందు, ఐపీఎల్లో 300 సిక్సర్ల రికార్డును క్రిస్ గేల్, రోహిత్ శర్మ మాత్రమే బ్రేక్ చేశారు. ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీకి ఈ అవకాశం లభించింది.

విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఐపీఎల్లో 298 సిక్సర్లు సాధించాడు. అతను ఇప్పటివరకు ఆడిన 271 మ్యాచ్లలో, 263 ఇన్నింగ్స్లలో ఈ ఘనతను అందుకున్నాడు. ఇప్పుడు, ఈ మ్యాచ్లో తన 300 సిక్సర్ల మైలురాయిని పూర్తి చేసుకునే అవకాశం అతనికి లభించింది.

లక్నో సూపర్జెయింట్స్తో జరిగే మ్యాచ్లో విరాట్ కోహ్లీ రెండు సిక్సర్లు కొడితే, అతను ఐపీఎల్లో 300 సిక్సర్లు కొట్టిన మూడవ బ్యాట్స్మన్గా నిలుస్తాడు. అంతేకాకుండా, ఈ ఘనత సాధించిన రోహిత్ తర్వాత రెండవ భారత బ్యాట్స్మన్గా కూడా నిలుస్తాడు.

ఈ జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 142 ఐపీఎల్ మ్యాచ్లలో 141 ఇన్నింగ్స్లలో 357 సిక్సర్లు కొట్టాడు. రెండవ స్థానంలో ఉన్న రోహిత్ శర్మ, 276 మ్యాచ్లలో 271 ఇన్నింగ్స్లలో 310 సిక్సర్లు కొట్టాడు.