
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ (IPL 2024) 52వ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లి ప్రత్యేక రికార్డును లిఖించే అవకాశం ఉంది.

అంటే గుజరాత్ టైటాన్స్తో జరిగే మ్యాచ్లో విరాట్ కోహ్లీ 6 పరుగులు చేస్తే.. టీ20 క్రికెట్లో 12500 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కనున్నాడు. అంతేకాదు ఈ ఘనత సాధించిన ప్రపంచంలో 4వ బ్యాటర్గా నిలుస్తాడు.

టీ20 క్రికెట్లో ఇప్పటివరకు 369 ఇన్నింగ్స్లు ఆడిన విరాట్ కోహ్లీ 9328 బంతుల్లో 12494 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 95 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు 12494 పరుగులకు 6 పరుగులు జోడిస్తే టీ20 క్రికెట్లో 12500 పరుగుల ప్రత్యేక రికార్డు క్రియేట్ అవుతుంది.

ఈసారి ఐపీఎల్లో అద్భుత బ్యాటింగ్ను ప్రదర్శించిన విరాట్ కోహ్లీ 10 ఇన్నింగ్స్ల్లో మొత్తం 500 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతను 4 అర్ధ సెంచరీలు, 1 సెంచరీ చేశాడు. కాబట్టి గుజరాత్ టైటాన్స్తో జరిగే మ్యాచ్లో కొత్త రికార్డును ఆశించవచ్చు.

టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. వెస్టిండీస్ బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ 14,562 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, పాకిస్థాన్కు చెందిన షోయబ్ మాలిక్ 13360 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 12900 పరుగులు చేసిన వెస్టిండీస్కు చెందిన కీరన్ పొలార్డ్ మూడో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 12494 పరుగులతో 4వ స్థానంలో ఉన్నాడు.