Mohammed Shami: ఇటీవల శ్రీలంకలో పర్యటించిన టీమిండియా వన్డే, టీ20 సిరీస్లు ఆడిన సంగతి తెలిసిందే. ఇందులో టీ20 సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియా వన్డే సిరీస్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణంగా ఆ జట్టు బ్యాట్స్మెన్ పేలవ ప్రదర్శనే కారణమని చెబుతున్నప్పటికీ.. ముఖ్యమైన బౌలర్లు అందుబాటులో లేకపోవటం కూడా ఓ కారణంగా చెప్పవచ్చు.
ఈ సిరీస్కు ఆ జట్టు ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. మరో అనుభవజ్ఞుడైన పేసర్ మహ్మద్ షమీ కూడా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యాలను కూడా ఈ సిరీస్కు ఎంపిక చేయలేదు. ఈ అనుభవజ్ఞులు అందుబాటులో లేకపోవడంతో వన్డే సిరీస్ను కోల్పోయింది.
ఇప్పుడు టీమిండియా సెప్టెంబర్లో బంగ్లాదేశ్తో స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్తో ప్రముఖ బౌలర్లు జట్టులోకి వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వన్డే ప్రపంచకప్ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమైన పేసర్ మహ్మద్ షమీ బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ ఆడే అవకాశం ఉంది.
భారత్, బంగ్లాదేశ్ మధ్య 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ సెప్టెంబర్లో ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో మహ్మద్ షమీ కూడా ఆడనున్నాడు. నివేదికల ప్రకారం, షమీ వేగంగా కోలుకుంటున్నాడు. ఇప్పటికే నెట్స్లో బౌలింగ్ ప్రారంభించాడు.
షమీ చీలమండ గాయం నుంచి కోలుకోవడంలో చాలా పురోగతి సాధించాడు. షమీ ప్రస్తుత పరిస్థితిపై సెలక్టర్లు ఎప్పటికప్పుడు అప్డేట్లు తీసుకుంటున్నారు. షమీ త్వరలో దులీప్ ట్రోఫీలో ఆడనున్నాడు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన షమీ.. టీమ్ ఇండియాకు ఆడే ముందు దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడని మీరు చూడొచ్చు.
మహ్మద్ షమీ చివరిసారిగా 2023 వన్డే ప్రపంచకప్లో జట్టు తరపున ఆడాడు. ఈ టోర్నీలో షమీ అద్భుత బౌలింగ్ను ప్రదర్శించి 24 వికెట్లు పడగొట్టి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు.