
గాయం కారణంగా వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టుకు దూరమైన భారత ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్.. జులై 27న బార్బడోస్లో జరిగే మూడు వన్డేల సిరీస్లో మొదటి మ్యాచ్కు అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది.

గజ్జల్లో గాయం కారణంగా శార్దూల్ రెండో టెస్టుకు దూరమైనట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది.

అయితే ఆ తర్వాత శార్దూల్ రికవరీ గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. కాబట్టి తొలి వన్డేకు శార్దూల్ ఠాకూర్ అందుబాటులో లేకుండా పోయే అవకాశాలున్నాయి.

ఒకవేళ శార్దూల్ ఠాకూర్ తొలి వన్డేకు దూరమైతే, మరో స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కూడా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న అక్షర్ పటేల్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కీలక సమయాల్లో టీమ్ఇండియాకు సహకరిస్తున్నాడు.

కాగా, టెస్టు సిరీస్లో శార్దూల్ పెద్దగా రాణించలేకపోయాడు. ఆడిన ఏకైక టెస్టులో ఠాకూర్ ఏడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి ఒక వికెట్ తీసుకున్నాడు. మార్చి 17న ఆస్ట్రేలియాతో చివరిగా వన్డే మ్యాచ్ ఆడిన శార్దూల్ ఆ మ్యాచ్లో కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు.

భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్-కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్-కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్.