IND vs WI 2nd Test: 500వ అంతర్జాతీయ మ్యాచ్లో కనిపిస్తున్న విరాట్ కోహ్లీ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. తాజా టెస్టు మ్యాచ్లో 87 పరుగులు చేసి క్రీజులోనే ఉన్న కింగ్ కోహ్లీ జాక్వెస్ కల్లీస్ని అధిగమించి అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు.
ఇక కింగ్ కోహ్లీ తాను ఆడుతున్న 500వ మ్యాచ్లోనే కల్లీస్ని అధిగమించి మొత్తంగా 25,548 రన్స్ చేశాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన 5వ ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.
అయితే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లుగా సచిన్ టెండూల్కర్(34,357) అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ తర్వాత కుమార సంగక్కర(28,016).. రికీ పాంటింగ్(27,483).. మహేలా జయవర్ధనే(25,957).. వరుస స్థానాల్లో ఉన్నారు. తాజాగా విరాట్ కోహ్లీ((25,548*) అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన 5వ ప్లేయర్లుగా ఎదిగాడు.
కాగా, ఇప్పటికే 500 మ్యాచ్ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కింగ్ కోహ్లీ(25,548*).. రికీ పాంటింగ్(25,035), సచిన్ టెండూల్కర్(24,874), జాక్వెస్ కల్లీస్(24,799) వంటి దిగ్గజాలను అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు.