
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో గతవారం నంబర్ వన్ ఆల్రౌండర్గా నిలిచిన రవీంద్ర జడేజా ఒక్క మ్యాచ్కే పరిమితమయ్యాడు. తాజా టెస్టు ర్యాంకింగ్స్లో రవీంద్ర జడేజా రెండో స్థానానికి పడిపోయాడు. శ్రీలంకతో బెంగళూరులో జరిగిన టెస్టులో జడేజా విఫలం కావడంతో ఈ మార్పులు జరిగాయి. అదే సమయంలో, జాసన్ హోల్డర్ మరోసారి నంబర్ వన్ కుర్చీని ఆక్రమించాడు.

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా చోటు దక్కించుకున్నాడు. బెంగళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసిన బుమ్రా నాలుగో ర్యాంక్కు చేరుకున్నాడు.

బ్యాట్స్మెన్లలో మార్నస్ లాబుస్చాగ్నే నంబర్ వన్గా మరగా, రోహిత్ శర్మ టీమిండియా తరపున టాప్ టెస్ట్ ర్యాంక్ బ్యాట్స్మెన్గా కొనసాగుతున్నాడు. రోహిత్ ఆరో స్థానంలో నిలిచాడు.

విరాట్ కోహ్లీ మాత్రం తన పేలవ ఫాంతో తంటాలు పడుతున్నాడు. మొత్తంగా నాలుగు ర్యాంకులు దిగజారి 9వ స్థానంలో నిలిచాడు. రిషబ్ పంత్ తన ఆటతో ఆకట్టుకుని టాప్ 10లో నిలిచాడు.

భారత్తో బెంగళూరు టెస్టులో సెంచరీ సాధించిన శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే 5వ స్థానానికి చేరుకున్నాడు. విరాట్ కోహ్లి స్థానంలో దిముత్ చేరాడు.