
India's Most Successful Captains: ఇటీవల , భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్పై అద్భుతంగా రాణించి మొదట టీ20 సిరీస్లో 4-1 తేడాతో ఓడించింది. ఆ తర్వాత, రోహిత్ శర్మ కెప్టెన్సీలో 3 మ్యాచ్ల ODI సిరీస్లో ఇంగ్లాండ్ను వైట్ వాష్ చేసింది. ఈ విజయంలో , రోహిత్ శర్మ కెప్టెన్గా తన పేరు మీద ఒక పెద్ద రికార్డును నమోదు చేసుకున్నాడు. నిజానికి, ఇప్పుడు రోహిత్ టీమిండియా నాల్గవ అత్యంత విజయవంతమైన కెప్టెన్ అయ్యాడు. అతని నాయకత్వంలో, టీం ఇండియా మూడు ఫార్మాట్లలో 98 మ్యాచ్లను గెలిచింది. టీమిండియాకు అత్యధిక మ్యాచ్ల్లో విజయాలు అందించిన ఐదుగురు కెప్టెన్ల గురించి ఇప్పుడ తెలుసుకుందాం..

5. సౌరవ్ గంగూలీ: మాజీ ఎడమచేతి వాటం బ్యాట్స్మన్ సౌరవ్ గంగూలీ భారత జట్టు అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా పేరుగాంచాడు. 1999 నుంచి 2005 వరకు 195 మ్యాచ్లకు టీమిండియా కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ కాలంలో, మెన్ ఇన్ బ్లూ 97 మ్యాచ్లను గెలవగలిగింది. అదే సమయంలో 78 మ్యాచ్ల్లో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. 15 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. 5 మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు.

4. రోహిత్ శర్మ: రోహిత్ శర్మ ప్రస్తుతం భారత వన్డే, టీ20 జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు. అతని కెప్టెన్సీలో, భారత జట్టు ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో 137 మ్యాచ్లు ఆడింది. ఈ సమయంలో టీమ్ ఇండియా 98 మ్యాచ్ల్లో విజయం సాధించింది. గత ఏడాది రోహిత్ కెప్టెన్సీలో భారత్ టీ20 ప్రపంచ కప్ గెలుచుకుంది.

3. మహ్మద్ అజారుద్దీన్: ఈ జాబితాలో మహ్మద్ అజారుద్దీన్ మూడవ స్థానంలో ఉన్నాడే. 1990-1999 వరకు, అజారుద్దీన్ కెప్టెన్సీలో టీం ఇండియా 211 మ్యాచ్లలో 104 విజయాలు సాధించింది. అజారుద్దీన్ కెప్టెన్సీలో టీం ఇండియా 100 కి పైగా మ్యాచ్లు గెలిచిన మూడవ ఆటగాడిగా నిలిచాడు.

2. విరాట్ కోహ్లీ: విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు మాత్రమే కాదు, మంచి కెప్టెన్ కూడా. కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు అనేక పెద్ద రికార్డులను బద్దలు కొట్టింది. కోహ్లీ 213 మ్యాచ్ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించగా, మెన్ ఇన్ బ్లూ 135 సార్లు గెలిచింది.

1. ఎంఎస్ ధోని: ఎంఎస్ ధోని అత్యుత్తమ భారత కెప్టెన్. అతని కెప్టెన్సీలో భారత జట్టు 3 ప్రధాన ICC టోర్నమెంట్లను గెలుచుకునేలా చేశాడు. ధోని కెప్టెన్సీలో భారత్ 332 మ్యాచ్లకుగాను 178 మ్యాచ్ల్లో విజయం సాధించింది. భవిష్యత్తులో భారత్కు ధోని లాంటి కెప్టెన్ దొరకడం చాలా అరుదు.