
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ముగిసిన తర్వాత, క్రికెట్ అభిమానులకు ఈ రోజు నుంచి మరో సిరీస్ అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఈరోజు విశాఖపట్నంలో డా. వైఎస్. రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.

ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టు ఆటగాళ్లలో ఎక్కువ మంది ఈ సిరీస్లో ఉన్నారు. అక్షర్ పటేల్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. అందరి దృష్టి రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్పైనే ఉంది. ఈ సిరీస్ తిలక్ వర్మతోపాటు రింకూ సింగ్కు అగ్ని పరీక్ష.

ఇది యువ జట్ల మధ్య జరుగుతున్న సిరీస్. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా సహా కొంతమంది ఆటగాళ్లు ఈ సిరీస్లో ఆడడం లేదు. ఈ టీ20 సిరీస్లో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు.

హార్దిక్ పాండ్యా లేకపోవడంతో రింకూ సింగ్ను ఫినిషర్గా 6వ స్థానంలో భారత్ ఎంచుకుంది. ఆల్ రౌండర్ల విషయానికొస్తే, అక్షర్తో పాటు వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే ఉన్నారు. అర్షదీప్ సింగ్, ప్రసీద్ధ్ కృష్ణ, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్ పేసర్లుగా బరిలోకి దిగనున్నారు.

ఆస్ట్రేలియా జట్టుకు మాథ్యూ వేడ్ నాయకత్వం వహించనున్నాడు. డేవిడ్ వార్నర్, షాన్ మార్ష్, పాట్ కమిన్స్, జోష్ హేజిల్వుడ్, మిచెల్ స్టార్క్లకు విశ్రాంతినిచ్చారు. అతని గైర్హాజరీలో జాసన్ బెహ్రెన్డార్ఫ్ పేస్ అటాక్కు నాయకత్వం వహిస్తాడు.

డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలోని పిచ్ బ్యాటింగ్ ట్రాక్లకు ప్రసిద్ధి చెందింది. ఇవి బ్యాట్స్మెన్లకు అనుకూలంగా ఉంటాయి. అయితే, ఇక్కడ స్పిన్నర్లు రాణిస్తారు. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానున్నందున మంచు ప్రభావం ఇరు జట్లపై పడవచ్చు. ముఖ్యంగా ఛేజింగ్ టీమ్కి ఇది సులువుగా ఉంటుంది.

భారత్ ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్: రుతురాజ్ గైక్వాడ్, యస్సవి జైస్వాల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, ప్రసీద్ధ్ కృష్ణ, ముఖేష్ కుమార్.