
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విందుకు హాజరయ్యారు..గురువారం శరద్ పవార్ పుట్టినరోజు.. 85 వసంతాలను పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా రేవంత్ రెడ్డి శరద్ పవార్ కి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

తన పుట్టిన రోజు సందర్భంగా శరద్ పవార్ తన నివాసంలో రాజకీయ నాయకులు, ప్రముఖులకు విందు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ కూడా పాల్గొన్నారు.

ఈ వేడుకల్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలను సైతం సీఎం రేవంత్ రెడ్డి కలిసారు.

ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై కాసేపు చర్చించుకున్నారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వివరించారు.