
అందం, టాలెంట్ ఉన్నా అవకాశాలకు అమడదూరంలో ఉన్న హీరోయిన్లలో అను ఇమ్మాన్యుయేల్ ఒకరు. న్యాచురల్ స్టార్ నాని నటించిన మజ్ను చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ చిన్నది.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. శైలజరెడ్డి అల్లుడు.. అజ్ఞాతవాసి వంటి చిత్రాల్లో స్టార్ హీరోలతో స్ర్కీన్ షేర్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు మాత్రం సరైన బ్రేక్ రాలేదు.

దీంతో కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. చాలాకాలంగా బిగ్ స్క్రీన్ పై సందడి చేయని అను.. ఇప్పుడు సోషల్ మీడియాలో అలరిస్తుంది. అను తండ్రి తంకచన్ ఇమ్మాన్యుయేల్, ఒక ప్రముఖ మలయాళ చిత్ర నిర్మాత. చిన్నతనంలోనే నటనపై ఆసక్తి పెంచుకున్న అను, తన సినీ ప్రస్థానాన్ని బాలనటిగా మొదలుపెట్టింది.

అను తొలిసారిగా 2011లో "స్వప్న సంచారి" అనే మలయాళ చిత్రంలో బాలనటిగా కనిపించింది. ఆ తర్వాత, 2016లో "యాక్షన్ హీరో బిజు" అనే మలయాళ చిత్రంతో కథానాయికగా అడుగుపెట్టింది. అదే సంవత్సరంలో తెలుగులో "మజ్ను" చిత్రంలో నాని సరసన నటించి, తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె నటనప్రేక్షకులను మెప్పించింది.

తర్వాత ఆమె పవన్ కళ్యాణ్తో "అజ్ఞాతవాసి", అల్లు అర్జున్తో "నా పేరు సూర్య" వంటి తెలుగు చిత్రాలలో నటించింది, అయితే ఈ చిత్రాలు ఆశించిన విజయం సాధించలేదు. దాంతో తమిళ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంది. తమిళంలో "తుప్పరివాలన్" (2017)తో అరంగేట్రం చేసిన ఈబ్యూటీ, "నమ్మ వీట్టు పిళ్లై" (2019) చిత్రంతో కమర్షియల్ విజయం సాధించింది.

ప్రస్తుతం అను చేతిలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. దాంతో సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడుపుతుంది ఈ చిన్నది. తాజాగా అను ఇమ్మాన్యుయేల్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.