కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అందాల భామ రష్మిక మందన్న టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ఆతర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది.
తక్కువ సినిమాలతోనే మంచి క్రేజ్ తెచ్చుకోవడంతో పాటు స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అలాగే తెలుగు సినిమాతోనే పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది.
తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. తెలుగు తమిళ్ లో స్టార్ హీరోలతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. ఇటీవలే యానిమల్ సినిమాతో హిట్ అందుకుంది ఈ బ్యూటీ.
దాంతో ఈ బ్యూటీలో అన్ని భాషల్లో క్రేజ్ పెరిగిపోయింది. స్టార్ హీరోల సినిమాలకు ఇప్పుడు ఈ అమ్మడే ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నది రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందని తెలుస్తోంది.
ప్రస్తుతం రష్మిక పుష్ప 2 సినిమాతో పాటు , హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సికిందర్ సినిమాలోనూ నటిస్తుంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘సికిందర్’ సినిమాలో నటించేందుకు రష్మిక మందన్న రూ.15 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని తెలుస్తోంది.