
కమిటీ కుర్రోళ్లు సినిమా నిహారిక అనౌన్స్ చేసినపుడు ఎవరూ పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. కానీ ప్రొడక్షన్ను నిహారిక ఎంత సీరియస్గా తీసుకున్నారనేది ఫస్ట్ సినిమా రిజల్ట్ చూసాకే అర్థమైంది. తాజాగా పింక్ ఎలిఫెంట్ బ్యానర్పై రెండో సినిమా ప్రకటించారు నిహారిక.

మ్యాడ్ స్క్వేర్ హీరో సంగీత్ శోభన్తో మానస శర్మ దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతుంది. కమిటీ కుర్రోళ్లు తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని మానస శర్మ చెప్పిన కథని ఫైనల్ చేసారు. ఓవైపు నటిస్తూనే.. మరోవైపు నిర్మాతగానూ బిజీ అవుతున్నారీమే.

Samantha

రౌడీ పిక్చర్స్ బ్యానర్లో నయనతార కూడా వరస సినిమాలు నిర్మిస్తూనే ఉంటారు. ఒక్కోసారి తనే హీరోయిన్గా.. కొన్నిసార్లు భర్త విఘ్నేష్ దర్శకత్వంలో సినిమాలు నిర్మిస్తుంటారు నయన్. వీటిలో కొన్ని హిట్ అయ్యాయి కూడా.

మన దగ్గర ఈ ట్రెండ్ ఈ మధ్యే మొదలైంది గానీ.. బాలీవుడ్లో అయితే అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా, కంగనా లాంటి హీరోయిన్స్ ప్రొడక్షన్లోనూ బిజీగా ఉంటారు. కంగనా నిర్మాణంతో పాటు దర్శత్వంలో బిజీ అయ్యారు.