
గీతా గోవిందం ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమోంటో హోటల్లో రష్మిక, విజయ్ ఏడడుగులు వేశారు. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి వివాహం గ్రాండ్ గా జరిగింది. మార్చి 4న వీరి వివాహ రిసెప్షన్ హైదరాబాద్ లో జరగనున్న సంగతి తెలిసిందే.

గీత గోవిందం సినిమాతో మొదలైన ఇద్దరి ప్రేమ ప్రయాణం ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యింది. అల్లరితో మొదలైన సినీప్రయాణం ఒకరి కోసం ఒకరు నిలబడేలా చేసింది. ఇన్నాళ్లు నేషనల్ క్రష్ గా ఉన్న రష్మిక ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇంటి మహాలక్ష్మిగా మారింది. రియల్ లైఫ్ మ్యారేజీతో ఒక్కటయ్యారు విజయ్, రష్మిక.

అటు వెండితెరపై వీరిద్దరి జోడికి అభిమానులు ఫిదా అయ్యారు. అలా మొదలైన వీరి పరిచయం డియర్ కామ్రేడ్ సినిమాతో ప్రేమగా మారింది. ఇప్పటికే చాలా కాలం వీరిద్దరి ప్రేమ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ ఇప్పుడు వీరు అధికారికంగా తమ బంధాన్ని ప్రకటించారు.

ప్రస్తుతం విజయ్, రష్మిక పెళ్లి ఫోటోస్ వైరలవుతున్నాయి. అయితే అంతకు ముందు వీరిద్దరు ఇన్ స్టా వేదికగా తమ ప్రేమ విషయాన్ని పరోక్షంగా వెల్లడిస్తూనే ఉన్నారు. పలు సందర్బాల్లో ఒకరిపై ఒకరికి ఉన్న అభిప్రాయాలను పంచుకుని అభిమానుల్లో జోష్ నింపారు.

ఇక ఎట్టకేలకు తమ బంధం పేరు అభిమానులు పిలుచుకుంటున్న విరోష్ అంటూ అధికారికంగా ఫిబ్రవరి 22న వెల్లడించారు. ఫిబ్రవరి 26న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విజయ్ రష్మిక పెళ్లి వేడుక విరోష్ పేరు మారుమోగుతుంది.