మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. నాగబాబు తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్యల త్రిపాఠిల వివాహం మరికొన్ని రోజుల్లో జరగనుంది. ఇటలీ వేదికగా జరగనున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్కు ఏర్పాట్లు గ్రాండ్గా జరుగుతున్నాయి. ఇందుకోసం ఇటలీకి బయలు దేరాడు కాబోయే పెళ్లి కొడుకు వరుణ్ తేజ్.
నవంబర్ 1న వరుణ్, లావణ్యల వివాహం జరగనుందని తెలుస్తోంది. ఇటలీలోని టుస్కానీ విలేజ్లో ఈ ప్రేమపక్షుల డెస్టినేషన్ మ్యారేజ్కు వేదికగా కానుంది.
వరుణ్, లావణ్యల వివాహానికి అతి కొద్ది మంది సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సినీ, రాజకీయ ప్రముఖుల కోసం హైదరాబాద్లో గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటుచేస్తున్నట్లు తెలుస్తోంది
ఇరు కుటుంబ సభ్యులతో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు ఫ్యామిలీ, ఇతర సన్నిహితులు మాత్రమే పెళ్లి వేడుకలో పాల్గొననున్నారు. తాజాగా వరుణ్ కూడా ఇటలీ ఫ్లైట్ ఎక్కేశాడు.
ఇక కాబోయే మెగా కోడలు లావణ్య మాత్రం వరుసగా బ్యాచిలరేట్ పార్టీల్లో పాల్గొంటోంది. వీటికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు తెగ వైరలవుతున్నాయి.