వనిత విజయ్ కుమార్ ఈ అమ్మడి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. నటిగా కంటే వివాదాలతోనే ఈ అమ్మడు ఎక్కువ పాపులర్ అయ్యింది. దేవి సినిమాతో వనిత విజయ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.
వనిత విజయ్ కుమార్ 1995లో తమిళంలో విడుదలైన 'చంద్రలేఖ' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తమిళంతో పాటు తెలుగు, మలయాళం సినిమాల్లో నటించింది.
2021లో వనిత అధికారికంగా చెన్నైలో వనిత విజయకుమార్ స్టైలింగ్ పేరుతో తన సొంత బట్టల దుకాణాన్ని ప్రారంభించింది . ఆమె పార్ట్ టైమ్ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా..
నటుడు విజయ్ కుమార్ కూతురు అయిన వనిత విజయ్ కుమార్ ఎక్కువగా వివాదాల్లో నిలిచింది. ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకుంది ఈ అమ్మడు. అందరితోనూ విడిపోయింది. ప్రస్తుతం ఒంటరిగా ఉంటుంది.
తాజాగా ఈ అమ్మడు తన తండ్రి పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తన తల్లి చనిపోతే కనీసం అంత్యక్రియలకు కూడా తనకు రానివాళ్లేదు అని తెలిపింది. రెండవ భార్యగా తన తల్లికి విజయ్ కుమార్ అస్సలు ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదని తెలిపింది. ఆమె చనిపోయిన తర్వాత తన పిల్లలకు రావాల్సిన ఆస్తిని రానివ్వకుండా మోసం చేశాడని తెలిపింది వనిత.