
పవన్ సినిమాల గురించి ఎంత క్లారిటీ ఇచ్చినా.. ఎంతోకొంత కన్ఫ్యూజన్ మిగిలే ఉంటుంది. ఓవైపు ఓజి.. మరోవైపు ఉస్తాద్ మత్తులో పడి హరిహర వీరమల్లు అనే సినిమా ఉందనే విషయాన్ని కూడా అభిమానులు మరిచిపోయారు. ఇలాంటి సమయంలో వీరమల్లు గురించి మత్తు వదిలిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. దాంతో పాటు ఓజి, ఉస్తాద్ అప్డేట్స్ వచ్చాయి. అవన్నీ ఇవాల్టి ఎక్స్క్లూజివ్లో చూసేద్దాం..

పవన్ కళ్యాణ్ మరోసారి సినిమాలపై ఫోకస్ చేసారు. ఆయనొక్కసారి ఇటువైపు వచ్చారంటే.. చాలా ఫాస్టుగా షెడ్యూల్స్ పూర్తవుతున్నాయి. దర్శకులు కూడా ఆయన రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హరిహర వీరమల్లు సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు నిర్మాత ఏఎం రత్నం. ఈ సినిమా ఆలస్యంపై ఆయన స్పందించారు.

కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ సినిమాను ఏఎం రత్నమే నిర్మించారు. ఈ సినిమా ప్రెస్ మీట్లో పవన్ సినిమాపై క్లారిటీ ఇచ్చారు. ఇది పీరియాడిక్ డ్రామా కాబట్టి పవన్ డేట్స్ ఇచ్చినా వేగంగా పూర్తి చేయడం కష్టం అని తేల్చేసారు రత్నం. సెట్స్ వేయడానికి చాలా టైమ్ పడుతుందని.. అందుకే వీరమల్లు లేట్ అవుతుందని చెప్పుకొచ్చారు. 2023లోనే హరిహర వీరమల్లు షూట్ పూర్తవుతుందని చెప్పారాయన.

మరో 20 రోజులు డేట్స్ ఇస్తే చాలు హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తైపోతుంది. అయితే ఈ సినిమాను ఒక్కటి కాదు రెండు భాగాలుగా తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు క్రిష్. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది మొదటి భాగం గురించి.. ఎన్నికలకు ముందే వీరమల్లు విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అలాగే మరో 15 రోజులు షూటింగ్ చేస్తే ఓజి కూడా పూర్తైపోతుంది.. ఇది కూడా రెండు భాగాలుగానే రాబోతుంది.

తక్కువ గ్యాప్లోనే ఓజి, వీరమల్లు పూర్తి చేయాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు ఎన్నికలకు అస్త్రంగా భావిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ను కూడా పూర్తి చేయాలని చూస్తున్నారు పవన్. దీనికోసం స్పెషల్గా డేట్స్ అలాట్ చేసారు కూడా. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు ముందే ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ రానున్నాయి.. కానీ ఇప్పుడు వీరమల్లు కూడా ముందే వస్తుందని క్లారిటీ ఇచ్చారు ఏఎం రత్నం. మొత్తానికి లెక్కలు బాగున్నాయి.. కానీ వర్కవుట్ అయినపుడే ఫ్యాన్స్కు ఆనందం.