
'గాండీవధారి అర్జున' కథలో నటించడాన్ని బాధ్యతగా భావించానని అన్నారు హీరో వరుణ్తేజ్. ఈ నెల 25న విడుదలవుతోంది 'గాండీవధారి అర్జున'. గురువారం విడుదలైన ట్రైలర్కి మంచి స్పందన వస్తోంది. యాక్షన్ మాత్రమే కాదు, ఎమోషన్స్ చాలా ఉంటాయన్నారు వరుణ్. పర్యావరణం గురించి కీలక విషయాలను చర్చించినట్టు దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెలిపారు.

'ఉస్తాద్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజమౌళి చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయిga. తాను, తన పెద్దన్న కీరవాణి కష్టపడి పైకి వచ్చామన్నారు. ఆ కథలు వింటూ పెరిగిన శ్రీసింహా, తమలాగే ప్రయాణం మొదలుపెట్టారని చెప్పారు. అబ్బాయిలు తమ ఫస్ట్ బైక్ని అసలు మర్చిపోరని, 'ఉస్తాద్'లో... బైక్నీ, విమానాన్ని కలిపిన తీరు బావుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నానితో పాటు పలువురు పాల్గొన్నారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళా శంకర్' సినిమా నిన్న విడుదలైంది. తమిళ 'వేదాళం' సినిమాకు రీమేక్ ఇది. ఈ ఏడాది ఆల్రెడీ 'వాల్తేరు వీరయ్య' సక్సెస్ మీదున్నారు చిరంజీవి. ఇప్పుడు భోళాశంకర్ సక్సెస్ కొడితే, వరుసగా హ్యాట్రిక్ హిట్ అందుకున్నట్టే. అందుకే నెట్టింట, థియేటర్ల ముందు సందడి చేస్తున్నారు అభిమానులు.

స్పెషల్ షో 2001లో విడుదలైన 'గదార్' చిత్రానికి సీక్వెల్గా రూపొందింది 'గదార్2'. సన్నీడియోల్, అమీషాపటేల్ జంటగా నటించారు. శుక్రవారం విడుదలైంది. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోసం ఆదివారం ఢిల్లీలో 'గదార్2' స్పెషల్ స్క్రీనింగ్ ప్లాన్ చేశారు మేకర్స్. ట్రైలర్ బావుండటంతో సినిమాకు మంచి హైప్ వచ్చింది.

అజయ్ దేవ్గణ్, కరీనా కపూర్, రణ్వీర్సింగ్, అక్షయ్కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా 'సింగం ఎగైన్'. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారు దీపిక పదుకోన్. ఈ సినిమా కోసం ఇప్పటికే 40 రోజుల కాల్షీట్ కేటాయించారు దీపిక. వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఆగస్టులో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు.