సక్సెస్ఫుల్ సినిమాల క్రేజ్ని క్యాష్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడైతే సీక్వెల్స్, ఫ్రాంఛైజీలు వస్తున్నాయి కదా.. అని అంటారా? అవి వస్తున్నాయి సరే... ఓ వైపు వాటిని చేస్తూనే, వాటిని మించిన మరో విషయాన్ని కూడా ఇంట్రస్టింగ్గా హ్యాండిల్ చేస్తున్నారు డైరక్టర్లు... కథలకు కొనసాగింపు మాత్రమే కాదు, క్యారక్టరైజేషన్లను కూడా ఇంట్రస్టింగ్గా కంటిన్యూ చేస్తున్నారు.
కేజీయఫ్లో రాకీ భాయ్ కేరక్టర్కి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఫస్ట్ పార్టును మించేలా సెకండ్ పార్టు సక్సెస్ కావడంలో రాకీ భాయ్ కేరక్టరైజేషన్ చాలా కీ రోల్ ప్లే చేసింది. పక్కా మాస్ మసాలా సినిమాలకు ప్యాన్ ఇండియా అప్పీల్ రావాలంటే ఇలాంటి కేరక్టరైజేషన్లను కంటిన్యూ చేయడం కంపల్సరీ అవుతోంది.
కర్ణాటక నుంచి రాకీ భాయ్ వచ్చినట్టు, తెలుగు స్టేట్స్ నుంచి ఇస్మార్ట్ శంకర్ బయలుదేరాడు. ఏమాత్రం ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయి కలెక్షన్లను కొల్లగొట్టిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఆ కేరక్టర్ బ్రాండ్తోనే ఇప్పడు పూరి డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమా జనాలను అంతే మాస్గా మెప్పిస్తుందా? లేకుంటే భారతీయుడులా తుస్సు మంటుందా?
లంచానికి వ్యతిరేకంగా సిల్వర్ స్క్రీన్ మీద ఎన్ని కేరక్టర్లు పోరాటం చేసినా, వాటన్నిటికీ ఐకానిక్ అడ్రస్గా నిలుస్తాడు భారతీయుడు. రెండున్నర దశాబ్దాలు దాటిన తర్వాత సేమ్ కేరక్టరైజేషన్ తో శంకర్ సినిమా తీస్తే, జనాలు చూడలేమంటూ సారీ చెప్పేశారు. భారీ హైప్తో కాకుండా, మంచి క్రేజ్తో మన దగ్గర విడుదలైన కార్తికేయ సెకండ్ చాప్టర్కి సూపర్డూపర్ రెస్పాన్స్ వచ్చింది.
కేరక్టరైజేషన్ల బ్రాండింగ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, డీజే టిల్లు ను ప్రస్తావించకపోతే చాప్టర్ అసలు క్లోజ్ కాదు. మేనరిజమ్తో, స్పెషల్ డిక్షన్తో అంతలా ప్రేక్షకులకు కనెక్ట్ అయింది డీజే టిల్లు కేరక్టర్. థర్డ్ పార్టులో టిల్లు ఏం చేస్తారో చూడాలని వెయిట్ చేస్తున్నారు జనాలు.