
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. తేజ దర్శకత్వం వహించిన లక్ష్మీ కల్యాణం చిత్రం ద్వారా తెలుగులో అడుగు పెట్టింది కాజల్. కళ్యాణ్ రామ్ హీరోగా 2007లో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ కాజల్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఆతర్వాత 2009లో హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ దెబ్బకు కాజల్ కు టాలీవుడ్ లో మంచి బ్రేక్ వచ్చి పడింది. దాంతో ఈ చిన్నదాని క్రేజ్ పెరిగిపోయింది.

అల్లు అర్జున్ ఆర్య 2, ప్రభాస్ డార్లింగ్ సినిమాలు కాజల్ క్రేజ్ ను ఇమేజ్ ను మరింత పెంచేశాయి. 2010లో ఈమె తమిళ హీరో సూర్య తమ్ముడు కార్తీ సరసన నా పేరు శివ చిత్రంలో నటించింది. ఈ సినిమా తో కోలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అక్కడ కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

తెలుగు, తమిళ్ భాషలతో పాటు హిందీలోనూ సినిమాలు చేసింది కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని 2020లో కరోనా లాక్ డౌన్ సమయంలో పెళ్లాడింది. వీరికి 2022 ఏప్రిల్ 19న మగబిడ్డ జన్మించాడు. ఆ సమయంలో సినిమాకు బ్రేక్ ఇచ్చింది కాజల్.

ఇక ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీగా మారింది. ఇటీవలే బాలకృష్ణ సరసన భగవంత్ కేసరి సినిమాలో నటించింది ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తుంది కాజల్. తాజాగా కొన్ని ఫోటోలను వదిలింది. ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.