
అయితే పఠాన్, జవాన్తో పోల్చి చూసినపుడు మాత్రం చాలా వెనకబడ్డారు కండలవీరుడు. ఆదివారం రిలీజ్ టైగర్ 3కి మైనస్ అయిందనేది ట్రేడ్ నుంచి వస్తున్న మాట. సాధారణంగా సినిమాలేమైనా శుక్రవారాలు విడుదలవ్వడం అనేది కామన్..

ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్యుయో అంటూ సల్మాన్, కత్రినా నటించిన టైగర్ 3 గురించి ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పారు మనీష్ శర్మ. ఆయన మాట్లాడుతూ ''టైగర్, జోయా మధ్య కెమిస్ట్రీని, వారిద్దరూ కలిసి చేసే యాక్షన్నీ చూడటానికి ప్రేక్షకులు ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు. వాళ్లిద్దరి రిలేషన్షిప్ గురించి ఇందులో ఇంకాస్త డీప్గా చూపించాం.

ఇది మనం చెప్పే మాట కాదు.. బాక్సాఫీస్ దగ్గర ఫిగర్స్ చెప్తున్న మాట. తాజాగా విడుదలైన సల్మాన్ ఖాన్ టైగర్ 3 కూడా మూడు రోజుల్లోనే 200 కోట్లు వసూలు చేసింది.

దాంతో నాలుగో రోజుకే కలెక్షన్స్ సగానికి సగం పడిపోయాయి. సెమీస్, ఫైనల్ మ్యాచులు ఉండటంతో ఈ వారమంతా వరల్డ్ కప్ ఫీవర్ ఉంటుంది. ఇండియా ఫైనల్ చేరితే.. టైగర్ 3కి మరో సండే కూడా శాపమే.

ఆల్రెడీ ఈ ఏడాది పఠాన్లో సల్మాన్ని, షారుఖ్ని ఒకే ఫ్రేమ్లో చూసిన ప్రేక్షకులు, మరోసారి సేమ్ విజువల్స్ చూడటానికి రెడీ అవుతున్నారు. ఈ సారి టైగర్3లో షారుఖ్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. టైగర్ త్రీక్వెల్లో షారుఖ్తో పాటు హృతిక్ కూడా గెస్ట్ రోల్ చేస్తారన్నది ఫ్యాన్స్ని ఊరిస్తున్న విషయం.

పండగ సీజన్ ఉంటే గురువారమే తీసుకొస్తుంటారు. కానీ టైగర్ 3 మాత్రం అటూ ఇటూ కాకుండా ఆదివారం వచ్చింది. దాంతో ముందు రెండు రోజులు పోయింది.. దానికితోడు వరల్డ్ కప్ ఫీవర్ కూడా సల్మాన్ సినిమాకు శాపంగా మారింది.

అన్నింటికి మించీ రొటీన్ యాక్షన్ సినిమా అనేది టైగర్ 3పై ఉన్న టాక్. ఇవన్నీ వార్, పఠాన్ కంటే సల్మాన్ ఖాన్ సినిమాను వెనక్కి నెట్టేసాయి. రాబోయే రోజులన్నీ టైగర్ 3కి కీలకమే. మరి వాటిని వాడుకుని.. 500 కోట్ల క్లబ్లో చేరుతుందా లేదా అనేది చూడాలిక.