
2021లో నాగశైర్య, రితూ వర్మ నటీనటులుగా తెరకెక్కిన వరుడు కావెలను సినిమాలోని 'దిగు దిగు దిగు నాగ' పాట వివాదంగా మారింది. ఈ పాటను రాసి అనంత శ్రీరామ్పై క్రిమినల్ కేసులు పెట్టారు. భక్తి పాటను ఐటెం సాంగ్ చేస్తారా.? అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రముఖ గాయనీ మంగ్లీ పాడిన ‘మైసమ్మ’ పాట కూడా కాంట్రవర్సీకి దారి తీసింది. ఓ ప్రైవేట్ ఆల్బమ్ కోసం మంగ్లీ పాడిన ‘చెట్టు కింద కూసున్నవమ్మా చుట్టం లెక్క ఓ మైసమ్మా…’, ‘మోతెవరి’ లాంటి పదాలపై కొన్ని హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

కాపీ కారణంగా కాంట్రవర్సీగా మారింది సాయి పల్లవి నటించిన 'సారంగదరియా’ పాట. జానపద గేయాన్ని మార్చి రాసిన సుద్ధాల అశోక్ తేజ దాని ఒరిజినల్ను సేకరించిన వ్యక్తికి క్రెడిట్ ఇవ్వలేదనే విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ ఏడాది కాంట్రవర్సీగా మారిన పాటల్లో ఇప్పుడు కాక ఇంకెప్పుడు సినిమాలోని భజ గోవిందం అనే పాటపై దుమారం చెలరేగింది. భక్తి పాటను అశ్లీలంగా చిత్రీకరించారంటూ కొందరు వాదించారు. దీంతో ఈ పాట వివాదానికి దారి తీసింది.

ఇక ఈ ఏడాది చివర్లో వచ్చిన పుష్పలోని 'ఊ అంటావా మామ.. ఉఉ అంటావా' పాట కూడా వివాదానికి అడ్రస్గా మారింది. సమంత స్పెషల్ సాంగ్గా తెరకెక్కిన ఈ పాటలో పురుషుల మనోభావాలను దెబ్బ తీసేలా చరణలు ఉన్నాయని కొందరు కేసు నమోదు చేశారు.