
సినిమా అనేది నిర్మాత, నటీనటుల కెరీర్ కు సంబంధించింది. అందుకే మూవీ తీసే క్రమంలో చాలా జాగ్రత్తగా దర్శకుడు, ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ప్రతి సన్నివేశాన్ని తీయాల్సి ఉంటుంది. ఎందుకంటే? అందులో ఏది బాగాలేకపోయినా సినిమా అంతబాగా ఆడదు.

దీంతో నమ్మకంగా డబ్బు పెట్టిన నిర్మాత, సినిమాతో కెరీర్ సెట్ అయిపోతుంది అనుకున్న నటీనటుల చాలా బాధపడాల్సి వస్తుంది. అందుకే ఒక సినిమాను ఒకే చేయడానికి ముందు హీరో, హీరోయిన్, దానికి పెట్టుబడి పెట్టడానికి నిర్మాత చాలా ఆలోచిస్తారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమంలో రిలీజైన రెండు సినిమాలు దారుణ పరాజయం చూశాయంట.

అంతే కాకుండా ఆ సినిమాలు థియేటర్లలో విడుదలైన ఐదో రోజు కనీసం ఒక్కటికెట్ కూడా అమ్ముడు పోలేదంట. అలాగే ఈ మూవీస్ నటీనటుల కెరీర్కు చాలా నష్టాన్నే కలిగించాయంట. ఇంతకీ ఆ సినిమాలు ఏవి అనేగా మీ డౌట్. అసలు విషయంలోకి వెళితే..

పరుశురాం దర్శకత్వంలో, దిల్ రాజు బ్యానర్ పై దిల్ రాజు ప్రొడ్యూసర్గా వ్యవహరించగా, విజయ్ దేవరకొండ, మృణాల్ జంటగా నటించిన మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ మూవీ విడుదలై నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అంతే కాకుండా రిలీజైన ఐదో రోజు ఈ మూవీ టికెట్స్ థియేటర్లలో ఒక్కటి కూడా అమ్మడు పోలేదంట.

అదే విధంగా మెగా హీరో వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన సినిమా మట్కా. ఈ మూవీ కరుణాకర్ దర్శకత్వంలో తెరకెక్కింది. కాగా ఈ మూవీ విడుదలై డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజైన ఐదవ రోజు థియేటర్లలో ఒక్కటికెట్ కూడా అమ్ముడు పోలేదంట.