బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్కి ప్రతిష్టాత్మక 77వ లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్లో జీవితకాల సాఫల్య పురస్కారం దక్కనుంది. పార్డో అలా కెరియరో అస్కోనా - లోకర్నో టూరిజం అవార్డుతో ఆగస్టు 10న ఆయన్ని సత్కరించనున్నారు. ఈ సందర్భంగా షారుఖ్ దేవదాస్ మూవీని చిత్రోత్సవాల్లో ప్రదర్శించనున్నారు.
షారుఖ్ ఎంతగానో ఎదురుచూసిన హిట్ని ఆయనకు అందించింది పఠాన్ సినిమా. అది కూడా మామూలుగా కాదు... వేరే లెవల్ హిట్ అది. వెయ్యి కోట్లను దాటిన ఇండియన్ సినిమాల జాబితాలో ప్లేస్ని పదిలం చేసుకుంది. కింగ్ ఖాన్ ఈ జ్ బ్యాక్ అని బాద్షా ఫ్యాన్స్ అందరూ సంబరాలు చేసుకున్నారు. ఆ హిట్ని కంటిన్యూ చేసింది జవాన్ సినిమా.
సౌత్ డైరక్టర్ అట్లీని నమ్మి, ఎక్కువగా సౌత్ క్రూని తీసుకుని చేసిన సినిమా జవాన్. పఠాన్లో షారుఖ్ సక్సెస్ని తోడుగా నిలిచిన దీపిక, జవాన్లోనూ స్టెప్పేశారు. తన చిరకాల ఫ్యాన్ నయన్కి జవాన్లో ఛాన్స్ ఇచ్చారు షారుఖ్. అన్ని విధాలా ఆయనకు మరో వెయ్యి కోట్లను దాటిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది జవాన్.
అదే ఊపులో టైగర్3లో గెస్ట్ రోల్ చేసి మెప్పించారు షారుఖ్. గతేడాది ఆయన కెరీర్లో విడుదలైన మరో సినిమా డంకీ. ఈ మూవీని సౌత్లో ఎందుకో పెద్దగా ప్రమోట్ చేయలేదు టీమ్. చేసి ఉంటే, తప్పకుండా కలెక్షన్లు పెరిగేవే. ఇన్ని సినిమాల తర్వాత కాస్త రెస్ట్ తీసుకున్నారు షారుఖ్.
మళ్లీ ఇప్పుడు ఆయన వర్క్ స్టార్ట్ చేయనున్నారు. కూతురితో కలిసి కింగ్ మూవీ చేస్తున్నారు బాద్షా. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ మూవీలో మెంటర్ రోల్కి రెడీ అయిపోయారు. 2023 మేజిక్ని ఈ సినిమాతో మళ్లీ రిపీట్ చేస్తారనే హోప్ కనిపిస్తోంది బాద్షా సైన్యంలో.