కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరాలు దాటి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది హీరోయిన్ రుక్మిణి వసంత. ఈ మూవీతో పాన్ ఇండియా లెవల్లో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలోనూ ఈ బ్యూటీకి మంచి క్రేజ్ వచ్చింది. దీంతో ఈ అమ్మడుకు అవకాశాలు ఎక్కువే వచ్చినట్లు సమాచారం. కానీ అచి తూచి ఆఫర్స్ ఓకే చేస్తుందట.
ఇక ఇప్పుడు ఈ బ్యూటీ టాలీవుడ్ పై కన్నేసింది. తెలుగులో నేరుగా సినిమా చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. అది కూడా రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన. ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
ఆ తర్వాత రాహుల్ సంకృత్యాన్, రవి కిరణ్ కోలా దర్శకత్వాల్లో పని చేయనున్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన వర్క్ జరుగుతుంది. ఈ క్రమంలోనే విజయ్, రవి కిరణ్ కాంబోపై ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.
ఈ సినిమా విజయ్ సరసన రుక్మిణి వసంత్ నటించనుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని.. స్క్రిప్ట్ నచ్చడంతో సినిమా చేసేందుకు రుక్మిణి ఓకే చెప్పిందట.