నాగ శౌర్య , రీతూ వర్మ జంటగా నటించిన ‘వరుడు కావలెను’ చిత్రం రేపు (శుక్రవారం) థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమాలో హీరోయిన్ రీతూ వర్మ భూమి అనే పాత్ర పోషించింది.
భూమి క్యారెక్టర్ తాను చేసిన మంచి పాత్రల్లో ఒకటిగా నిలిచిపోతుందని రీతూ ధీమా వ్యక్తంచేసింది.
ఈ సినిమాలో నాగ శౌర్యతో కెమిస్ట్రీ కూడా కుదిరింది.. మా పెయిర్ బాగా ఉందని చాలా మంది చెప్పున్నారని రీతూ తెలిపింది.
గతంలో ‘పెళ్లి చూపులు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన రీతూ.. ఇప్పుడు ‘వరుడు కావలెను’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
పెళ్లీడుకు వచ్చిన ఎవరికైనా మొదట ఎదురయ్యే ప్రశ్న.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావు.? అని.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఏదో ఒక సమయంలో ఈ ప్రశ్నను ఎదుర్కొనే ఉంటారు.
అయితే ఈ ప్రశ్న మరీ ముఖ్యంగా హీరోయిన్లకు ఎక్కువగా ఎదురవుతుంటుంది.
మీడియా ముందుకు వస్తే చాలు కచ్చితంగా పెళ్లికి సంబంధించిన ప్రశ్నను అడిగేస్తుంటారు.
తాజాగా వరుడు కావలెను ప్రమోషన్లో భాగంగా హాజరైంన రీతూకు తన పెళ్లి ఎప్పుడన్న ప్రశ్న ఎదురైంది.
రీతూ వర్మ పెళ్లి విషయమై స్పందిస్తూ దానికి చాలా టైమ్ ఉంది.. మరో రెండు మూడేళ్లయినా పట్టొచ్చని చెప్పుకొచ్చింది.