
టాలీవుడ్ స్క్రీన్ మీద తెలంగాణ యాసకు మంచి డిమాండ్ ఏర్పడింది. గతంలో విలన్లకు కమెడియన్లకు ఈ యాసలో డైలాగ్స్ పెట్టిన మేకర్స్, ఇప్పుడు హీరోలను కూడా తెలంగాణ బ్యాక్డ్రాప్లో చూపిస్తున్నారు. అందుకే సక్సెస్ కోసం మాస్ మహరాజ్ కూడా ఇదే ఫార్మాలను నమ్ముకున్నారు.

రీసెంట్ టైమ్స్లో రవితేజ సినిమాలేవి ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వటం లేదు. వరుసగా రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలు ఫెయిల్ అయ్యాయి. దీంతో అప్ కమింగ్ సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు మాస్ మహరాజ్.

గతంలో తనకు సూపర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నారు రవితేజ. ఈ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఉగాది సందర్భంగా తన 75వ సినిమాను ఎనౌన్స్ చేశారు. రచయిత భాను భోగవరపును దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఓ సక్సెస్ ఫార్ములాను రిపీట్ చేస్తున్నారు.

రీసెంట్ టైమ్స్లో తెలంగాణ బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమాలు ఘన విజయం సాధించాయి. బాలకృష్ణ, భగవంత్ కేసరి, నాని దసరా లాంటి సినిమాలు వంద కోట్ల మార్క్ను టచ్ చేశాయి. అందుకే అదే ఫార్ములాను మరోసారి రిపీట్ చేస్తున్నారు రవితేజ. పూర్తిగా తెలంగాణ యాసలో ఓ సినిమా చేస్తున్నారు. ఫస్ట్ ఎనౌన్స్మెంట్తోనే ఈ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.

గతంలో వాల్తేరు వీరయ్య సినిమాతో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పారు రవితేజ. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మరోసారి అదే ఫార్ములా రిపీట్ చేస్తుండటం, అది కూడా రవితేజ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావటంతో ఆర్టీ 75 మీద అభిమానుల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి.