
హీరో ఎవరైనా కానీ.. వాళ్ల పేరు ముందు ఇంటిపేరులా ఒకరి పేరు మాత్రం కామన్గా ఉంటుంది.. అదే ఏషియన్. టాలీవుడ్ హీరోలందర్నీ కబ్జా చేస్తున్నారు వాళ్లు. మన హీరోలతో కలిసి బిజినెస్లు చేస్తున్నారు.

తాజాగా రవితేజ సైతం మల్టీప్లెక్స్ బిజినెస్లోకి అడుగు పెడుతున్నారు. మరి మాస్ రాజా కట్టబోయే థియేటర్స్ ఎక్కడున్నాయి..? వాటి ముచ్చట్లేంటి.? మన హీరోలకు సినిమాలు మాత్రమే కాదు.. బిజినెస్ కూడా ముఖ్యమే.

అందుకే ఇక్కడ వచ్చిన డబ్బుల్ని అక్కడ పెడుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది మల్టీప్లెక్స్ బిజినెస్పై మనసు పారేసుకుంటున్నారు. ఇదే దారిలో రవితేజ కూడా వెళ్తున్నారు.

దిల్సుఖ్ నగర్లోని జ్యోతి 70MMను రెన్యువేట్ చేసి.. అక్కడే మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు రవితేజ. ఏషియన్ వాళ్లతో కలిసి రవితేజ ఈ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. మొత్తం 6 స్క్రీన్స్తో ఉన్న మల్టీప్లెక్స్గా దీన్ని రెన్యువేట్ చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ, మహేష్, అల్లు అర్జున్ ఇప్పటికే మల్టీప్లెక్స్ బిజినెస్లో ఉన్నారు. బన్నీ ఈ మధ్యే అమీర్ పేట్లోని సత్యం థియేటర్ను పడగొట్టి అదే స్థానంలో AAA సినిమాస్ నిర్మించారు.

ఏషియన్ వాళ్లతోనే కలిసి మహబూబ్నగర్లో AVD సినిమాస్ నిర్మించారు విజయ్ దేవరకొండ. ఇది సూపర్ సక్సెస్ ఫుల్గా నడుస్తుంది.

వీళ్లందరి కంటే ముందు ఏషియన్తో టై అప్ అయి గచ్చిబౌలిలో AMB మొదలుపెట్టారు మహేష్ బాబు. ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్ ఇది. ఇప్పుడు రవితేజ కూడా ఇదే బిజినెస్ మొదలు పెడుతున్నారు.