రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. బాలీవుడ్లో వచ్చిన రైడ్ చిత్రానికి రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం కావడం విశేషం. వీరిద్దరి కాంబినేషన్లో ఇది వరకు వచ్చిన షాక్, మిరపకాయ్ ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే.
దీంతో ఈ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా ఆగస్టు 14వ తేదీ నుంచి ప్రీమియర్స్ ప్రారంభంకానున్నాయి.
ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. వాస్తవానికి ఈ సినిమా అక్టోబర్లో విడుదల చేద్దామని తొలుత చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.
అయితే పుష్ప 2 చిత్రం విడుదల వాయిదా పడిన నేపథ్యంలో మిస్టర్ బచ్చన్ను అనుకున్న తేదీ కంటే ముందుగానే తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.
ఈ సినిమాలో రవితేజ అమితాబ్ అభిమానిగా నటించనున్నారు. నిజజీవితంలోనూ రవితేజ అమితాబ్ ఫ్యాన్ అనే విషయం తెలిసిందే.