
విజయ్ దేవరకొండ, రష్మిక కొన్ని సంవత్సరాలుగా ప్రేమిచుకొని, ఫిబ్రవరి 26న ఘనంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గీతా గోవిందం మూవీలో కలిసి నటించిన వీరు, డియర్ కామ్రేడ్ మూవీ సమయంలో ప్రేమలో పడ్డారు. తర్వాత నుంచి వీరి ప్రేమ గురించి అనేక వార్తలు వచ్చాయి. కానీ వీటిపై వీరు ఎప్పుడూ స్పందించలేదు.

ఏకంగా వెడ్డింకార్డుతో తమ అభినులకు సర్ప్రైజ్ ఇచ్చారు. వారి ప్రేమను తెలుపుతూ, తామ వివాహ బంధం గురించి తెలియజేశారు. అతి కొద్ది మంది సమక్షంలో ఉదయ్ పూర్లలో రెండు సంప్రదాయాల ప్రకారం ఘనంగా వివాం చేసుకున్నారు.

ఇక వివాహం అనంతరం హైదరాబాద్ చేరుకున్న ఈ జంట, మార్చి 4న రిసెప్షన్ చేసుకోనున్నారు. ఈ క్రమంలో వివాహం తర్వాత ప్రముఖలను కలిసి వారి రిసెప్షన్ వేడుకకు రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అంతే కాకుండా వివాహం తర్వాత వీరు ఎక్కడ కనిపించినా వారి ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే తాజాగా ఈ కొత్త జంట అల్లు ఇంట సందడి చేసింది. మార్చి6న అల్లు శిరీష్ పెళ్లి జరగనున్న విషయం తెలిసిందే. అయితే శిరీష్ పెళ్లి కొడుకు వేడును ఘనంగా చేశారు. ఈ కార్యక్రమానికి విరోష్ జంట హాజరైంది.

ఈ క్రమంలో విజయ్ దేవరకొండను, రష్మికను అల్లు అరవింద్, అల్లు అర్జున్ అభినందించారు. ఈ నవ జంట వారితో కాసేపు ఆనందంగా గడిపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఈ ఫొటోలపై ఓ లుక్ వేయండి.