
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యే అప్డేట్ ఇచ్చారు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్. తన అప్ కమింగ్ సినిమాల గురించి మాట్లాడిన రణబీర్, పనిలో పనిగా తారక్ సినిమా గురించి కూడా క్లారిటీ ఇచ్చేశారు. అదేంటి తారక్ సినిమాకు రణబీర్కు సంబంధం ఏంటి అనుకుంటున్నారా..? క్లారిటీ కావాలంటే వాచ్ దిస్ స్టోరి.

బ్రహ్మాస్త్ర సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న రణబీర్ కపూర్, ఆ సినిమా సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ గ్యాప్లో ఆల్రెడీ ఓ సినిమా చేశారు రణబీర్. మరో మూవీ రిలీజ్కు రెడీ అవుతోంది. అయినా అభిమానుల ఫోకస్ మాత్రమే బ్రహ్మాస్త్ర 2 మీదే ఉంది. అందుకే ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు చాక్లెట్ భాయ్.

ఆల్రెడీ దర్శకుడు అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర పార్ట్ 2 కథను వినిపించారని, ఈ సినిమా తొలి భాగం కన్నా పది రెట్లు భారీగా ఉండబోతోందని హింట్ ఇచ్చారు. సీక్వెల్లో దేవ్ రోల్ ఎవరు ప్లే చేస్తారన్న విషయంలో ఇంకా క్లారిటీ రాకపోయినా... ఆ క్యారెక్టర్ కూడా రణబీరే ప్లే చేసే ఛాన్స్ ఉందన్న టాక్ అయితే బలంగా వినిపిస్తోంది. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి మరో పది నెలల టైమ్ పడుతుందన్నారు రణబీర్.

ప్రజెంట్ అయాన్ ముఖర్జీ వార్ 2 వర్క్లో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లీడ్ రోల్స్లో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తవుతుందని చెప్పారు రణబీర్. అంటే ఏప్రిల్లో దేవర రిలీజ్ అయితే ఆ వెంటనే వార్ 2 షూటింగ్ కూడా పూర్తవుతుంది. ఎంత డీలే అయినా 2024 చివర్లో లేదంటే, 2025 స్టార్టింగ్లోనే వార్ 2 కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.

ట్రిపులార్ తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్న ఎన్టీఆర్ నుంచి వరుస సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా రణబీర్ ఇచ్చిన అప్డేట్తో ఏడెనిమిది నెలల గ్యాప్లోనే తారక్ నటించిన రెండు భారీ చిత్రాలు ఆడియన్స్ ముందుకు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు.