
బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ చిన్నదానికి సొంతం. కెరటం సినిమాతో వెండి తెరకు పరిచయమైన ఈ చిన్నది, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో తెలుగు అభిమానుల మనసు దోచుకుంది. ఈ మూవీతో టాలీవుడ్ యూత్ ఫేవరెట్ అయిపోయింది.

ఈ మూవీ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్కు టాలీవుడ్ స్టార్ హీరోల సరసన అవకాశాలు వచ్చాయి. దీంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి ఫేమ్ సంపాదించుకుంది. ముఖ్యంగా నాగచైతన్యతో రారండి వేడుక చూద్దాం, ధృవ, సరైనోడు వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది.

కొన్ని రోజుల పాటు టాలీవుడ్ను షేక్ చేసిన ఈ బ్యూటీ, తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గడంతో, బాలీవుడ్ చెక్కేసింది. బాలీవుడ్ లో వరసగా ఛాన్స్ లు అందుకొని, అక్కడ కూడా స్టార్ హీరోలతో థియేటర్లలో సందడి చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

మరీ ముఖ్యంగా రకుల్ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహం అతి కొద్ది మంది బంధువులు, స్నేహితుల మధ్య గోవాలో ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత ఈ బ్యూటీ సినిమాల పరంగా కాస్త స్లో అయినా, బిజినెస్ లతో ఫుల్ బిజీ అయిపోయింది.

ఓ వైపు మూవీస్, మరో వైపు బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ చాలా బిజీగా గడుపుతుంది ఈ చిన్నది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటో షూట్ తో కుర్రకారు మదిని దోచేస్తుంటుంది. తాజాగా ఈ చిన్నది బ్లాక్ కలర్ డ్రెస్లో తన అందంతో మతిపొగొడుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.