
ఎక్కడ ఆపారో అక్కడే మొదలుపెట్టారు పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఇద్దరికీ టైమ్ బాగోలేదు. అప్పుడొచ్చిన హిట్టు.. మళ్లీ ఇప్పటి వరకు రానని మొండికేసింది. అందుకే డబుల్ ఇస్మార్ట్తో డబుల్ స్పీడ్లో దాన్ని ఒడిసిపట్టుకోవాలని ఫిక్సైపోయారు ఈ జోడీ. దానికోసమే చేయాల్సిన మాస్ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు.

చూస్తున్నారుగా.. ఇస్మార్ట్ శంకర్లో ఎక్కడైతే ఆపేసారో అక్కడ్నుంచే సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసారు రామ్. ఐదేళ్ల కింద పూరీతో కలిసి ఆయన చేసిన రచ్చ అంత ఈజీగా మరిచిపోలేం. మాస్ సెంటర్స్లో ఇస్మార్ట్ శంకర్ దూకుడు మామూలుగా చూపించలేదప్పుడు. ఏకంగా 40 కోట్లకు పైగా వసూలు చేసింది ఇస్మార్ట్ శంకర్. దీనికిప్పుడు సీక్వెల్ రెడీ అవుతుంది.

ఇస్మార్ట్ శంకర్ విజయంలో మణిశర్మ మ్యూజిక్ కీలకం. ఎక్కడ చూసినా ఆ పాటలే వినిపించేవి. అదే స్థాయిలో ఇప్పుడు సీక్వెల్కు మాయ చేయడం అంటే చిన్న విషయం కాదు.. కానీ అదే మ్యాజిక్ మరోసారి చేయాలని బాగానే ట్రై చేస్తున్నారు మణిశర్మ. ఈ క్రమంలోనే ఇప్పుడు విడుదలైన స్టెప్పా మార్ పాట.. ఇస్మార్ట్ శంకర్ను గుర్తు చేస్తుంది.

రామ్లో మళ్ళీ అదే ఎనర్జీ కనిపిస్తుంది. పాట రికార్డ్ చేస్తున్నపుడు కూడా ఇటు మణిశర్మ కానీ.. అటు పూరీ గానీ ఫుల్ జోష్ మీదున్నారు. ఇస్మార్ట్ శంకర్ పాటలో పూరీ వాయిస్ కూడా అక్కడక్కడా ఉంటుంది. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ పాటలోనూ ఇదే రిపీట్ చేసారు డ్యాషింగ్ డైరెక్టర్. ఆగస్ట్ 15న డబుల్ ఇస్మార్ట్ విడుదల కానుంది. కావ్య తప్పర్ ఇందులో హీరోయిన్.

ప్రమోషనల్ కంటెంట్ విడుదలవుతున్న కొద్దీ సినిమాపై ఆసక్తి కూడా పెరిగిపోతుంది. ముఖ్యంగా లైగర్ తర్వాత పూరీ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. ఆయనకు కీలకంగా మారింది ఈ చిత్రం. సంజయ్ దత్ ఉండటంతో బాలీవుడ్లోనూ డబుల్ ఇస్మార్ట్పై మంచి ఆసక్తి ఉంది. మొత్తానికి చూడాలిక.. పూరీ, రామ్ కలిసి మరోసారి అదే మాస్ మ్యాజిక్ చేస్తారా లేదా అనేది..!