
ఒకవేళ ఆయన రెడీ కాని పక్షంలో ఆయా మూవీ యూనిట్స్.. ప్రభాస్ లేని పార్ట్ ని చిత్రీకరిస్తాయట. ప్రస్తుతానికి డార్లింగ్ కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న క్లారిటీ ఇది.

అయితే స్పిరిట్ నుంచి ఈ విధానంలో మార్పు కనిపిస్తుందన్నది ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్న మాట. స్పిరిట్లో మూడు లుక్స్ ఉంటాయట ప్రభాస్కి.

ఇంకోవైపు సలార్2 స్టార్ట్ చేస్తానంటున్నారు ప్రశాంత్ నీల్. సో ఇన్నిటి మధ్య డార్లింగ్ అటూ ఇటూ షఫిల్ కావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

ఈ ఎనౌన్స్మెంట్తో ఇంట్రస్టింగ్ ఫైట్కు తెర లేపారు డార్లింగ్. ది రాజాసాబ్ మూవీని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిన అదే డేట్కు ఆల్రెడీ కర్చీఫ్ వేశారు లోకనాయకుడు కమల్ హాసన్.

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న థగ్లైఫ్ సినిమాను సమ్మర్ రిలీజ్కు రెడీ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో 2025 ఏప్రిల్ 10న సిల్వర్ స్క్రీన్ మీద బిగ్ క్లాష్ తప్పదని తేలిపోయింది.

వరుస విజయాలతో సూపర్ ఫామ్లో ఉన్న ప్రభాస్, విక్రమ్ తరువాత పాన్ ఇండియా రేంజ్లో మళ్లీ క్రేజ్ తెచ్చుకున్న కమల్ హాసన్ ముఖా ముఖి తలపడుతుండటం,

అది కూడా రెండూ పాన్ ఇండియా సినిమాలే కావటంతో బాక్సాఫీస్ నెంబర్ కొత్త హైట్స్ చూడటం పక్కా అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.