
తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటి పూజా హెగ్డే. అయితే తాజాగా పూజా హెగ్డే తెలుగు సినిమాల్లో నటించడం తగ్గించింది.

పూజా హెగ్డే ఇటీవలే మహేష్ బాబు నటిస్తున్న 'గుంటూరు కారం' నుండి కూడా తప్పుకుంది. అలాగే పవన్ కళ్యాణ్ సినిమా నుంచి కూడా తప్పుకుంది.

హిందీ సినిమాపై ఎక్కువ దృష్టి పెట్టేందుకు పూజా తెలుగు సినిమాలను రిజక్ట్ చేస్తోందని టాక్ వినిపిస్తుంది.

పూజా హెగ్డేకి ఇప్పుడు పెద్దగా సినిమాలు లేవు. ప్రస్తుతం హిందీలో ‘దేవా’ అనే సినిమాలో నటిస్తుంది. పూజా హెగ్డే రిజక్ట్ చేసిన సినిమాలను రష్మిక, శ్రీలీల అందిపుచ్చుకుంటున్నారని టాక్.

పూజా హెగ్డే ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉంటుంది అలాగే తరచుగా తన హాట్ చిత్రాలను పంచుకుంటుంది.