
2022 వైబ్ని ఈ ఏడాది రీక్రియేట్ చేయాలని ఫిక్సయిపోయారు నిత్యామేనన్. 2023, 2024లో మిస్ అయిన అన్నీ ఛాన్సులను ఈ ఏడాది ఎలాగైనా అందిపుచ్చుకోవాలని అనుకుంటున్నట్టున్నారు. ఆమె లైనప్ చూసిన వారు కూడా ఆ విషయాన్నే కన్ఫర్మ్ చేస్తున్నారు.

తిరు చిత్రంబలం కాంబో ఈ ఏడాది రిపీట్ అవుతోంది. ధనుష్తో ఇడ్లీ కడై సినిమా చేస్తున్నారు నిత్యామీనన్. ఆ సినిమాను తలదన్నేలా ఈ సినిమా ఉంటుందన్నది ధనుష్ చెబుతున్న మాట.

ఈ పెయిర్కి ఆల్రెడీ సూపర్ పాజిటివ్ బజ్ ఉండటంతో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే హైప్ భీభత్సంగా కనిపిస్తోంది. ఇటు విజయ్ సేతుపతితో తలైవన్ తలైవిలో నటిస్తున్నారు.

పరోటా మాస్టర్గా విజయ్ సేతుపతి, ఆయన భార్యగా నిత్యామీనన్ చేస్తున్న సందడి ఆల్రెడీ ఆడియన్స్ కి రీచ్ కావడం మొదలైంది. సో, ఈ సినిమా రిలీజ్ కోసం మేం వెయిటింగ్ అంటూ పచ్చజెండా చూపిస్తున్నారు ఫ్యాన్స్.

ఆల్రెడీ ఈ ఏడాది సంక్రాంతికి కాదలిక్క నేరమిల్లై అంటూ సక్సెస్ చూశారు నిత్యామీనన్. రవి మోహన్ హీరోగా నటించిన ఈ సినిమా కోలీవుడ్లో డీసెంట్గా హిట్గా పేరు తెచ్చుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. సో, సూపర్ సక్సెస్తో స్టార్ట్ అయిన ఇయర్.. సేమ్ వైబ్ని కంటిన్యూ చేస్తుందన్నది నిత్య నమ్మకం.