
అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ తాజాగా పోలీసులను ఆశ్రయించింది. ఎవరో తెలియని వ్యక్తి తనను సోషల్ మీడియా వేదికగా వేధిస్తున్నాడంటూ నటి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

గత కొన్ని రోజుల నుంచి ఆవ్యక్తి తనకు మెసేజ్ చేస్తూ చంపేస్తాను,రేప్ చేస్తాను అంటూ తనను వేధిస్తున్నాడంటూ ఆమె పేర్కొంది. మొదటల్లో ఇది టీజింగ్ అని పట్టించుకోలేదని. కానీ రోజు రోజుకు ఆయన వేధింపులు ఎక్కువ అవుతున్నాయని ఆమె పేర్కొంది.

అతను తననే కాకుండా తన ఫ్యామిలీ మెంబర్స్ను కూడా టార్గెట్ చేసి బెదిరిస్తున్నాడని, దీంతో మానసికంగా చాలా కుంగిపోతున్నాను, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఫిర్యాదులో వేధింపులకు గురి చేసిన చాటింగ్ స్క్రీన్ షాట్స్ను పోలీసులకు అందించినట్లు సమాచారం.

ఇక ఓ వైపు హనీరోజ్ వివాదం కొనసాగుతుండగానే మరో హీరోయిన్ గుర్తు తెలియని వ్యక్తి వేధిస్తున్నాడంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం చర్చానీయశం అయ్యింది.

ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో, రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజా సాబ్ సినిమాలో నటిస్తోంది.