
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. గతేడాది లక్కీ భాస్కర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది మీనాక్షి. జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది.

డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో హీరోగా వెంకటేశ్ నటిస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఇందులో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ ఆకట్టుకున్నాయి.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి ఆసక్తికర విషయాలను పంచుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా నటించిన గోట్ చిత్రంలో కథానాయికగా కనిపించింది మీనాక్షి.

ఈ సినిమా తర్వాత తనపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేశారని.. ఆ వీడియోస్ చూసి తాను ఎంతో బాధపడినట్లు చెప్పుకొచ్చింది. ఆ ట్రోల్స్ వల్ల దాదాపు వారం రోజులు డిప్రెషన్ లోకి వెళ్లానని తెలిపింది.

ఆ తర్వాత లక్కీ భాస్కర్ సినిమా విడుదల గొప్ప విజయాన్ని అందుకుందని.. అందులో తన నటనకు ప్రశంసలు లభించాయని.. కథల ఎంపికలో మార్పులు చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చింది.