
టాలీవుడ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి వివాహబంధంతో ఒక్కటయ్యారు.

ఫిలిం నగర్లోని మంచు లక్ష్మి నివాసంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం రాత్రి సరిగ్గా 8.30 నిమిషాలకు మౌనిక మెడలో మూడు ముళ్లు వేశాడు మనోజ్.

వేద మంత్రాల సాక్షిగా జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. నూతన వధూవరులు ఆశీర్వదించారు.

మోహన్ బాబు దంపతులు, మంచు లక్ష్మీ, మంచు విష్ణు, వైఎస్ విజయమ్మ, టీజీ వెంకటేశ్, కోదండరామిరెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ, దేవినేని అవినాష్ తదితరులు మనోజ్ వివాహ వేడుకకు హాజరైన వారిలో ఉన్నారు.

ప్రస్తుతం మనోజ్- మౌనికల పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.