
మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ఫుల్ ఫామ్లో ఉన్నారు. 2024లో రెండు నెలల్లో రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ సీనియర్ స్టార్, ప్రతీ నెల ఓ సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఒక సినిమా థియేటర్లలో ఉండగానే మరో సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసేస్తున్నారు. ఈ స్పీడు చూసి యంగ్ హీరోలు కూడా షాక్ అవుతున్నారు.

భ్రమయుగం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఎక్స్పరిమెంటల్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమా కమర్సియల్గానూ సూపర్ హిట్ అయ్యింది.

ఆల్రెడీ 50 కోట్ల మార్క్ను క్రాస్ చేసి వంద కోట్ల దిశగా దూసుకుపోతోంది భ్రమయుగం. ఈ సినిమా ఇంకా థియేటర్లలో ఉండగానే నెక్ట్స్ మూవీ టర్బో ప్రమోషన్ స్టార్ట్ చేశారు మాముక్కా.

ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తున్న మమ్ముట్టి మార్చి ఎండింగ్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్కు పెద్దగా టైమ్ పట్టదు కాబట్టి అనుకున్న టైమ్కు రిలీజ్ అవ్వటం ఖాయంగానే కనిపిస్తోంది.

కడుగన్నవ ఒరు యాత్ర అనే మరో మూవీ కూడా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్కు రెడీ అవుతోంది. బజూకా అనే మరో మూవీ కూడా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది.

ఈ రెండు సినిమాలు సమ్మర్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మమ్ముట్టి. ఇలా ప్రతీ నెల ఓ సినిమా రిలీజ్ చేస్తూ కుర్ర హీరోలకు కూడా షాక్ ఇస్తున్నారు.