
హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ 1989 డిసెంబర్ 31న జన్మించింది. ఆమె అసలు పేరు సత్యప్రియ భవాని. సాధారణ కుటుంబంలో పుట్టి కాలేజీ చదువు పూర్తి చేసి ఓ ప్రముఖ ప్రైవేట్ టెలివిజన్ స్టేషన్లో యాంకర్గా పనిచేశారు.

మొదట్లో న్యూస్ రీడర్గా పనిచేసిన ఆమె.. ఆ తర్వాత దో కాదల్ హై సీరియల్ ద్వారా అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాకు సినిమా ఆఫర్స్ క్యూ కట్టాయి.

దర్శకుడు రత్నకుమార్ తెరకెక్కించిన మేయద మాన్ చిత్రంతో రంగప్రవేశం చేసింది. ఈ సినిమా 2017లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో ఎస్.మధుమిత పాత్రలో నటించి బాగా పాపులర్ అయ్యింది.

ఆ తర్వాత కడకుట్టి సింగం, రాక్షసుడు, మాఫియా, జడాలి సనంధోమ్ వంటి చిత్రాల్లో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత తెలుగు భాషలోనూ పలు సినిమాల్లో నటించింది.

కళ్యాణం కమనీయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. వరుస ఆఫర్స్ అందుకుంది. ఇటీవలే డిమోంటీ కాలనీ 2 సినిమాతో మెప్పించింది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.