
రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ మూవీ టాక్సి్క్. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటిస్తుండగా.. అందులో బాలీవుడ్ తార కియారా అద్వానీ ఒకరు.

ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, మోన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున నిర్మిస్తుండగా.. ఈ చిత్రంలో యష్ సరసన ఏకంగా ఐదుగురు హీరోయిన్ రుక్మిణీ వసంత్, కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియలు నటిస్తున్నారు.

అయితే ఇందులో కియారా అద్వారీ స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న కియారా .. ఇప్పుడు టాక్సిక్ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. చాలా కాలంగా ఆమె సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో కియారా నదియా అనే పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన ఫోటోలలో కియారా మరింత అందంగా కనిపిస్తుంది. అయితే ఈ చిత్రానికి ఇప్పుడు కియారా తీసుకునే రెమ్యునరేషన్ గురించి నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది.

టాక్సిక్ సినిమా కోసం కియారా ఏకంగా రూ.15 కోట్లు పారితోషికం తీసుకుంటుందని టాక్. ఇది ఆమె కెరీర్ లోనే హయ్యేస్ట్ రెమ్యునరేషన్ అని సమాచారం. గేమ్ ఛేంజర్ కోసం దాదాపు 7 కోట్లు వరకు తీసుకుంది. అలాగే వార్ 2 చిత్రానికి రూ.13 కోట్లు తీసుకుంది.