
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది…

ఆ తర్వాత వినయ విధేయ రామ మూవీలో మెప్పించింది. అయితే స్టార్ హీరోస్ నటించినప్పటికీ కియారాకు తెలుగులో అంతగా అవకాశాలు మాత్రం రాలేదు

దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. తాజాగా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది చిన్నది.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో నటిస్తోంది.

ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే గత కొద్ది రోజులుగా ఈ బ్యూటీ ప్రేమ, పెళ్లి గురించి పలు వార్తలు బీటౌన్ లో చక్కర్లు కొడుతున్నాయి.

స్టార్ హీరో సిద్ధార్థ్, కియారా ప్రేమలో ఉన్నారని.. వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగిందంటూ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ రూమర్స్ పై అటు సిద్ధార్థ్ కానీ.. కియారా స్పందించలేదు. తాజాగా తన గురించి వస్తున్న రూమర్స్ పై స్పందించింది కియారా.

ప్రస్తుతం తనకు ఇలాంటి వార్తల గురించి పట్టించుకునేంత తీరిక లేదని.. ఇలాంటి వార్తలను సృష్టించే వారు ఏం ఆశిస్తారో అర్థం కాదని తెలిపింది. నా వ్యక్తిగత విషయాల గురించి నా కుటుంబసభ్యుల దగ్గర మాత్రమే చర్చిస్తానని.. ప్రస్తుతం తన కెరీర్ మీద మాత్రమే ఫోకస్ పెడుతున్నట్లుగా చెప్పుకొచ్చింది..