నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది కీర్తి సురేష్..ఆతర్వాత `మహానటి` చిత్రంతో తిరుగులేని గుర్తింపుతో పాటు ప్రశంసల్ని జాతీయ పురస్కారాన్ని దక్కించుకుంది
ఆతర్వాత కీర్తి నటించిన సినిమాల్లో నేను లోకల్ తప్ప మిగిలినవి ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయాయి
కీర్తి చేసిన సీక్వెల్స్ సామి స్క్వేర్ - పందెం కోడి 2 సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందించలేకపోయాయి.
ఆ తర్వాత పెంగ్విన్ - మిస్ ఇండియా.. సూపర్ స్టార్ రజనీతో కలిసి చేసిన `అన్నాత్తే`.. మోహన్ లాల్ తో చేసిన `మరక్కార్`.. నగేష్ కుకునూర్ `గుడ్ లక్ సఖి` సినిమాలు నిరాశపరిచాయి
కీర్తి సురేష్ దృష్టంతా సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటిస్తున్న `సర్కారు వారి పాట`పైనే వుంది.
తొలిసారి కీర్తిసురేష్ `సర్కారు వారి పాట`లో గ్లామర్ డోస్ పెంచేసి షాకివ్వాబోతోందట. ఇప్పటికే విడుదలైన కళావతి ప్రోమోలో అమ్మడు హాట్ గా కనిపించదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.